News October 14, 2025
పథకాలు సాధించిన దీప్తికి సీఎం అభినందనలు

పర్వతగిరి మండలానికి చెందిన దీప్తి జీవాంజీ ఆస్ట్రేలియాలో జరిగిన వర్టూస్ ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్-2025లో 2 స్వర్ణ పతకాలు సాధించింది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఆమెను మంగళవారం అభినందించారు. సాధారణ, మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి, ఎన్నో కష్టాలను ఎదుర్కొని దేశ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్న దీప్తి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని సీఎం ఆకాంక్షించారు.
Similar News
News October 15, 2025
టీనేజర్ల కోసం ఇన్స్టాలో కొత్త రూల్స్!

ఇన్స్టాగ్రామ్లో టీనేజర్ల భద్రత కోసం మెటా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సినిమాల తరహాలోనే PG-13 రేటింగ్ మార్గదర్శకాల ఆధారంగా టీనేజ్ యూజర్లకు కంటెంట్పై రెస్ట్రిక్షన్స్ విధించనుంది. ఆటోమేటిక్గా 18 ఏళ్లలోపు యూజర్లను 13+ కేటగిరీ సెట్టింగ్లో ఉంచనున్నట్లు తెలిపింది. పేరెంట్స్ పర్మిషన్ లేకుండా పిల్లలు దానిని ఛేంజ్ చేయలేరు. డ్రగ్స్ వాడకం, అడల్ట్, హింసాత్మక కంటెంట్లను వారికి చూపించదు.
News October 15, 2025
శ్రీశైలంలో ఛత్రపతి శివాజీ రాజ్యం

శ్రీశైలంలో మల్లన్న దర్శనం అనంతరం చూడాల్సిన చారిత్రక ప్రదేశం ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం. శివాజీ రాజసాన్ని ప్రతిబింబించేలా భారీ బురుజులు, మధ్యలో కోట.. అందులో భారీ విగ్రహం వంటివి ఎన్నో ఉన్నాయి. శివాజీ 1677లో శ్రీశైలం పుణ్య క్షేత్రాన్ని సందర్శించి, ఆలయానికి ఉత్తరం వైపున ధ్యానం చేయడంతో ఆ ప్రదేశంలోనే ధ్యాన మందిరం నిర్మించారు. ఈ స్ఫూర్తి మందిరాన్ని ఈనెల 16న ప్రధాని మోదీ సందర్శించనున్నారు.
News October 15, 2025
అదుపు తప్పిన మనసుకు మార్గదర్శనం ‘వేదం’

వేదం వైరాగ్యాన్ని బోధించదు. అది అదుపు తప్పే మానవ హృదయాలను ధర్మమార్గంలో నడిపిస్తుంది. అందుకే వేదాన్ని దివ్య జ్ఞాన సంపదగా పండితులు చెబుతారు. వేదంలో జీవిత పరమార్థం, ఆనందం, శాంతి సౌభాగ్యాల కోసం పవిత్రమైన ఆకాంక్ష నిక్షిప్తమై ఉన్నాయి. ఈ వేదసారం సర్వమానవాళికి అందుబాటులోకి రావాలని వేదమే ఉద్ఘాటించింది. సత్యమైన జీవితాన్ని, సంతోషాన్ని పొందడానికి వేదం మార్గదర్శకమని గ్రహించాలి. <<-se>>#VedikVibes<<>>