News October 14, 2025

లండన్ పర్యటనలో స్పీకర్ అయ్యన్న

image

ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు మంగళవారం లండన్‌లోని యూకే పార్లమెంట్‌ను సందర్శించారు. అక్కడ పెద్దల సభ, సామాన్యుల సభ ఉపసభాపతులతో సమావేశమయ్యారు. పార్లమెంట్‌లో కమిటీలు ఎలా పనిచేస్తాయి, ప్రజాప్రతినిధుల బాధ్యతలు, ప్రభుత్వ జవాబుదారీతనం గురించి మాట్లాడారు. యూకే పార్లమెంట్లో కమిటీ వ్యవస్థ పనితీరును, దానిని మరింత సమర్థవంతంగా మార్చే మార్గాలను తెలుసుకున్నారు.

Similar News

News October 15, 2025

వైద్యశాఖకు రూ.500 కోట్లు విడుదల: సీఎం

image

TG: వైద్యారోగ్య శాఖకు తక్షణమే రూ.500 కోట్లు విడుదల చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రులను ప్రక్షాళన చేయాలన్నారు. మంత్రి దామోదర్ రాజనర్సింహ, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్ తదితరులతో ఆయన నివాసంలో సమీక్షించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. టిమ్స్ ఆస్పత్రులు, వైద్య కళాశాలల నిర్మాణాల వ్యయంపై ఆరా తీశారు. మరోవైపు సీఎం ఇవాళ హన్మకొండలో పర్యటించనున్నారు.

News October 15, 2025

అనకాపల్లి: ‘ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్‌తో కల్తీ మద్యం గుర్తింపు’

image

ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్‌తో కల్తీ మద్యాన్ని గుర్తించవచ్చునని అనకాపల్లి జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి సుధీర్ మంగళవారం తెలిపారు. షాపులో కొనుగోలు చేసిన మద్యం బాటిల్‌‌‌పై ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మొత్తం సమాచారం వస్తుందన్నారు. సమాచారం రాకపోతే కల్తీ మద్యంగా గుర్తించాలన్నారు. బీరు బాటిల్ స్కాన్ చేస్తే ఎటువంటి సమాచారం రాదన్నారు. మద్యం బాటిల్ స్కాన్ చేయడానికే ఇది ఉపయోగపడుతుందన్నారు.

News October 15, 2025

నగరిలో దారుణ హత్య

image

రూ.1.25 కోట్ల నగదు కోసం గుణశీలన్(65)ను హత్య చేసి డెడ్ బాడీని ముక్కలు చేసి చెరువులో పడేశారు. నగరి పట్టణం కొత్తపేటకు చెందిన గుణశీలన్‌కు విజయ్‌తోపాటు ముగ్గురు సంతానం. విజయ్‌కు అదేఊరిలోని గంగాధరం కూతరు కౌలస్యతో పెళ్లి జరిగింది. కుటుంబ సమస్యలతో 6 నెలలకే విజయ్ సూసైడ్ చేసుకున్నాడు. ఆయన పేరు మీద వచ్చిన రూ1.25 కోట్ల ఇన్సూరెన్స్ నగదు కోసం గంగాధరంతోపాటు మరోవ్యక్తి గుణశీలన్ను హత్య చేసినట్లు పోలీసులుతెలిపారు.