News October 14, 2025
₹212 కోట్లతో అమరావతిలో రాజ్భవన్

AP: అమరావతిలో ₹212కోట్లతో రాజ్భవన్ నిర్మించనున్నారు. దీనికి నిధులు, పాలన అనుమతి ఇస్తూ ప్రభుత్వం GO జారీచేసింది. గవర్నర్ రెసిడెన్స్ కాంప్లెక్స్గా నిర్మించే ఇందులో గవర్నర్ మాన్షన్, దర్బార్ హాల్, ఆఫీస్, 2 గెస్ట్ హౌస్లు, 6 సీనియర్ స్టాఫ్, 12 జూ.స్టాఫ్, 40 సపోర్టింగ్ స్టాఫ్ క్వార్టర్లు, 20 రూముల బ్యారెక్స్, 144 బ్యారెక్ అకామిడేషన్లను ఏర్పాటుచేస్తారు. కాంపౌండ్కు 4 వైపులా సెంట్రీ పోస్టులు ఉంటాయి.
Similar News
News October 15, 2025
వైద్యశాఖకు రూ.500 కోట్లు విడుదల: సీఎం

TG: వైద్యారోగ్య శాఖకు తక్షణమే రూ.500 కోట్లు విడుదల చేయాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రులను ప్రక్షాళన చేయాలన్నారు. మంత్రి దామోదర్ రాజనర్సింహ, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్రాజ్ తదితరులతో ఆయన నివాసంలో సమీక్షించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. టిమ్స్ ఆస్పత్రులు, వైద్య కళాశాలల నిర్మాణాల వ్యయంపై ఆరా తీశారు. మరోవైపు సీఎం ఇవాళ హన్మకొండలో పర్యటించనున్నారు.
News October 15, 2025
విద్యుత్ సంఘాల సమ్మె వాయిదా

AP: విజయవాడలో విద్యుత్ సంఘాల నేతలతో CS విజయానంద్, విద్యుత్ CMDల చర్చలు ముగిశాయి. సమస్యలకు సంబంధించి కొన్ని అంశాలపై చర్చలు కొలిక్కొచ్చాయని JAC నేత కృష్ణయ్య పేర్కొన్నారు. ‘కొన్ని అంశాలు పెండింగ్లోనే ఉన్నాయి. ప్రధాని మోదీ కర్నూలు పర్యటన నేపథ్యంలో సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నాం. ఈ నెల 17న మ.3 గం.కు మళ్లీ చర్చలకు హాజరవుతాం. అప్పుడు సమ్మెపై నిర్ణయం తీసుకుంటాం’ అని తెలిపారు.
News October 15, 2025
బ్రహ్మకు ఒక పగలు.. మనకు ఎంతంటే?

వేంకటాచల మాహాత్మ్యం ప్రకారం.. ప్రస్తుతం ఉన్న కలియుగం 4,32,000 సంవత్సరాలు. ద్వాపరయుగం దీనికి రెండింతలు. అంటే 8,64,000 సంవత్సరాలు. త్రేతాయుగం మూడింతలు. అంటే 12,96,000 సంవత్సరాలు. ఇక ధర్మప్రధానమైన కృతయుగం నాలుగు రెట్లు. అంటే 17,28,000 సంవత్సరాలు. ఈ నాలుగు యుగాలు కలిస్తే ఓ మహాయుగం. ఇలాంటి వెయ్యి మహాయుగాలు బ్రహ్మదేవునికి ఓ పగలు అవుతుంది. మరో వెయ్యి మహాయుగాలు ఒక రాత్రి అవుతుంది. <<-se>>#VINAROBHAGYAMU<<>>