News October 14, 2025
స్వాహా చేసిన సొమ్మును రికవరీ చేయిస్తాం: అరుణ కుమారి

రోళ్ల మండలం గిద్దబొమ్మనహళ్లిలో మహిళా సంఘాల సభ్యుల డబ్బును స్వాహా చేసిన యానిమేటర్ తిమ్మరాజు నుంచి రికవరీ చేయిస్తామని డీఆర్డిఏ ప్రాజెక్టు మేనేజర్ అరుణకుమారి తెలిపారు. అందుకు సంబంధించి మంగళవారం గ్రామంలో విచారణ చేపట్టారు. శ్రీనిధి రుణాల వివరాలను పరిశీలించారు. యానిమేటర్ తిమ్మరాజు రూ.2.50 లక్షలు వాడుకున్నట్లు అధికారుల ముందు అంగీకరించారని ఆమె తెలిపారు.
Similar News
News October 15, 2025
వైద్యశాఖకు రూ.500 కోట్లు విడుదల: సీఎం

TG: వైద్యారోగ్య శాఖకు తక్షణమే రూ.500 కోట్లు విడుదల చేయాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రులను ప్రక్షాళన చేయాలన్నారు. మంత్రి దామోదర్ రాజనర్సింహ, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్రాజ్ తదితరులతో ఆయన నివాసంలో సమీక్షించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. టిమ్స్ ఆస్పత్రులు, వైద్య కళాశాలల నిర్మాణాల వ్యయంపై ఆరా తీశారు. మరోవైపు సీఎం ఇవాళ హన్మకొండలో పర్యటించనున్నారు.
News October 15, 2025
అనకాపల్లి: ‘ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్తో కల్తీ మద్యం గుర్తింపు’

ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్తో కల్తీ మద్యాన్ని గుర్తించవచ్చునని అనకాపల్లి జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి సుధీర్ మంగళవారం తెలిపారు. షాపులో కొనుగోలు చేసిన మద్యం బాటిల్పై ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మొత్తం సమాచారం వస్తుందన్నారు. సమాచారం రాకపోతే కల్తీ మద్యంగా గుర్తించాలన్నారు. బీరు బాటిల్ స్కాన్ చేస్తే ఎటువంటి సమాచారం రాదన్నారు. మద్యం బాటిల్ స్కాన్ చేయడానికే ఇది ఉపయోగపడుతుందన్నారు.
News October 15, 2025
నగరిలో దారుణ హత్య

రూ.1.25 కోట్ల నగదు కోసం గుణశీలన్(65)ను హత్య చేసి డెడ్ బాడీని ముక్కలు చేసి చెరువులో పడేశారు. నగరి పట్టణం కొత్తపేటకు చెందిన గుణశీలన్కు విజయ్తోపాటు ముగ్గురు సంతానం. విజయ్కు అదేఊరిలోని గంగాధరం కూతరు కౌలస్యతో పెళ్లి జరిగింది. కుటుంబ సమస్యలతో 6 నెలలకే విజయ్ సూసైడ్ చేసుకున్నాడు. ఆయన పేరు మీద వచ్చిన రూ1.25 కోట్ల ఇన్సూరెన్స్ నగదు కోసం గంగాధరంతోపాటు మరోవ్యక్తి గుణశీలన్ను హత్య చేసినట్లు పోలీసులుతెలిపారు.