News October 14, 2025
నూజివీడులో ఖాతాదారుల బంగారు నగలు మాయం

నూజివీడులోని ఓ ప్రైవేట్ ఫైనాన్స్ బ్యాంకు సిబ్బంది ఖాతాదారులకు చెందిన రూ.8.68 లక్షల విలువైన బంగారు నగలు చోరీ చేసినట్లు మంగళవారం కేసు నమోదు చేసినట్లు సీఐ సత్య శ్రీనివాస్ తెలిపారు. 12 మంది ఖాతాదారులకు చెందిన బంగారు నగలు మాయం చేసిన ఘటనపై విజయవాడ రీజినల్ మేనేజర్ కొండలరావు ఫిర్యాదు చేసినట్లు వివరించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు వివరించారు.
Similar News
News October 15, 2025
నగరిలో దారుణ హత్య.. అసలు ఏం జరిగిందంటే.?

గుణశీలన్(65) కుమారుడు <<18008874>>విజయ్ సూసైడ్ <<>>అనంతరం ఆయన పేరుపై ఉన్న రూ.1.25కోట్ల ఇన్సూరెన్స్ డబ్బు నామినీగా ఉన్న తండ్రి ఖాతాకు జమ అయింది. రూ.10 లక్షలను గుణశీలన్ కౌసల్యకు ఇచ్చాడు. తన కూతురికి తక్కువ ఇచ్చాడని గంగాధరం కక్ష పెంచుకున్నాడు. మరో వ్యక్తి అయ్యప్పన్కు గుణశీలన్ రూ.30 లక్షలు అప్పుగా ఇచ్చాడు. అతడు నగదు ఇవ్వకుండా మెండికేయడంతో గుణశీలన్ నిలదీశాడు. దీంతో ఇద్దరూ గుణశీలన్ను హత్య చేశారు.
News October 15, 2025
ఇంటర్వ్యూతో IRCTCలో ఉద్యోగాలు

IRCTC 16 హాస్పిటాలిటీ మానిటర్ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనుంది. పోస్టును బట్టి BSc హాస్పిటాలిటీ, BBA, MBA, BSc హోటల్ మేనేజ్మెంట్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఆసక్తిగల వారు ఈనెల 16, 17 తేదీల్లో కోల్కతాలోని IRCTC జోనల్ ఆఫీస్లో ఇంటర్వ్యూకు హాజరు కావొచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. రిజర్వేషన్ గల అభ్యర్థులకు ఏజ్లో సడలింపు ఉంది. వెబ్సైట్: www.irctc.com
News October 15, 2025
AP న్యూస్ అప్డేట్స్

* తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 30న పుష్పయాగం. 29న అంకురార్పణ కారణంగా సహస్ర దీపాలంకార సేవ, 30న ఆర్జిత సేవలు రద్దు.
* రోగులు, క్షతగాత్రులకు అత్యవసర సేవలందించేందుకు కొత్తగా 190 ‘108’ వాహనాలను అందుబాటులోకి తేనున్న రాష్ట్ర ప్రభుత్వం
* విజయనగరం జిల్లాలో JSW సంస్థ రూ.531.36 కోట్లతో 1166 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న మెగా ఇండస్ట్రియల్ పార్క్కు ప్రభుత్వం అనుమతి