News October 15, 2025

HYD: సెల్ ఫోన్ డ్రైవింగ్.. 80 వేల కేసుల నమోదు

image

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సెల్ ఫోన్ డ్రైవింగ్‌పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. డ్రైవింగ్ సమయంలో ఫోన్ వాడకుండా సీపీ హెచ్చరికల నేపథ్యంలో ప్రత్యేక బృందాలు తనిఖీలు చేపట్టాయి. జనవరి 1 నుంచి అక్టోబర్ 12 వరకు 80,555 కేసులు నమోదు కాగా, అక్టోబర్ 13 నుంచి మంగళవారం వరకు నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లో మరో 2,345 కేసులు నమోదైనట్లు తెలిపారు. No Call Is More Important Than a Life అంటూ ప్రచారం చేస్తున్నారు.

Similar News

News October 15, 2025

జూబ్లీహిల్స్‌లో 23 వేల కొత్త ఓట్లపై అనుమానం: BRS

image

జూబ్లీహిల్స్‌లో నకిలీ ఓట్ల వివాదం చిలిచిలికి గాలివానైంది. నకిలీ ఓట్ల విషయమై రాష్ట్ర ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసి 24 గంటలు గడిచినా స్పందన లేదంటూ BRS సీరియస్ అవుతోంది. ఈ నేపథ్యంలో నేడు హైకోర్టు మెట్లు ఎక్కాలని ఆ పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. జూబ్లీహిల్స్‌ నియెజకవర్గంలో 23 వేల కొత్త ఓట్లు నమోదు కావడం అనుమానాస్పదమంటూ, దీనిపై చర్యలు తీసుకునేలా చేయాలని హైకోర్టును ఆశ్రయించనుంది.

News October 15, 2025

నేడు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత నామినేషన్

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు నేడు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత నామినేషన్ దాఖలు చేయనున్నారు. షేక్‌పేట్ తహశీల్దార్ కార్యాలయంలో నామినేషన్ వేయబోతున్నారు. ఆమె వెంట కేటీఆర్, హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ వెళ్లనున్నారు. సాదాసీదాగా నామినేషన్ కార్యక్రమం నిర్వహించాలని బీఆర్ఎస్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ నెల 19న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో భారీ ర్యాలీకి బీఅర్ఎస్ సన్నాహాలు మొదలుపెట్టింది.

News October 15, 2025

సికింద్రాబాద్: రన్నింగ్ ట్రైన్‌లో మహిళపై అత్యాచారం

image

గుంటూరు నుంచి చర్లపల్లి వస్తున్న ట్రైన్‌లో దారుణం జరిగింది. పోలీసుల వివరాలిలా.. సోమవారం రాత్రి రైలులో ఒంటరిగా ఉన్న మహిళ(35)ను దుండగుడు కత్తితో బెదిరించి, హ్యాండ్ బ్యాగ్, సెల్‌ఫోన్ లాక్కొని, అత్యాచారం చేశాడు. అనంతరం APలోని పెద్దకూరపాడు స్టేషన్ వద్ద దిగి పారిపోయాడు. బాధితురాలు మంగళవారం చర్లపల్లికి రాగానే GRP పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.