News October 15, 2025
HYD: ఎదలోతులో.. ఏమూలనో నిదురించు జ్ఞాపకాలు..

90‘sలో స్కూలుకు వెళ్లేటప్పుడు అమ్మనాన్న ఇచ్చిన ఆటానా, చారాణా మనకెంతో గొప్ప. వాటితో స్కూలు గేటు ముందు చాక్లెట్లు, నారింజ మిఠాయి, కొబ్బరుండలు కొనుక్కొని షర్ట్ అడ్డుపెట్టి కొరికి స్నేహితులతో పంచుకునేవాళ్లం. బాల్యంలో చేసినవి గుర్తొస్తే కళ్లవెంబడి నీళ్లొస్తాయి కదా? అబ్దుల్లాపూర్మెట్లోని RNR కాలనీ ప్రభుత్వ పాఠశాల వద్ద పిల్లలు గేట్ ముందు కొనుక్కుంటూ కనిపించారు. స్కూల్ లైఫ్ ఎప్పటికీ ఎవర్గ్రీన్.
Similar News
News October 15, 2025
VJA: ‘సూపర్ జీఎస్టీ సేవింగ్స్ ఉత్సవాలను వినియోగించుకోండి’

పున్నమిఘాట్లో ఈ నెల 13న ప్రారంభమైన గ్రేట్ అమరావతి షాపింగ్ ఫెస్టివల్లో ప్రతిరోజూ లక్కీడ్రా నిర్వహిస్తున్నామని జేసీ ఎస్. ఇలక్కియా తెలిపారు. ఫెస్టివల్ చివరి రోజు బంపర్ డ్రా తీసి విజేతకు స్కూటీ బహూకరిస్తామన్నారు. ఈ ఉత్సవాల ద్వారా ప్రజలకు నాణ్యమైన ఉత్పత్తులు తగ్గిన జీఎస్టీ రేట్లతో, ప్రత్యేక రాయితీలతో లభిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్శీశా, అధికారులు పాల్గొన్నారు.
News October 15, 2025
నారాయణపేటలో విద్యార్థుల ఆగ్రహం

జిల్లాలోని పలు గ్రామాలకు నిలిపివేసిన బస్ సర్వీసులను పునఃప్రారంభించాలని బుధవారం నారాయణపేట ఆర్టీసీ డిపోలో సీఐ అలివేలుతో PDSU, SFI నేతలు వాగ్వాదానికి దిగారు. గ్రామాలకు వెళ్లాల్సిన బస్సులను ఆదాయం కోసం ఇతర పట్టణాలకు పంపించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. బస్ సర్వీసులు లేక, ప్రైవేట్ వాహనాలకు ఛార్జీలు చెల్లించక పేద విద్యార్థులు ఉన్నత చదువులకు దూరం అవుతున్నారని జిల్లా కోశాధికారి మహేశ్ ఫైర్ అయ్యారు.
News October 15, 2025
రేషన్ షాపుల్లో నో స్టాక్ బోర్డులు!

తెనాలిలోని పలు రేషన్ దుకాణాల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. 15వ తేదీ వరకు రేషన్ పంపిణీకి అవకాశం ఉన్నా కొన్నిచోట్ల బియ్యం స్టాకు లేదంటూ బోర్డులు పెట్టేస్తుండటంతో ప్రజలు నిరాశతో వెనుతిరుగుతున్నారు. కొందరు డీలర్లు ఈ నెల స్టాక్ తక్కువగా వచ్చిందని చెబుతూ కార్డుదారుల వేలిముద్ర తీసుకుని బియ్యంకి బదులు కిలోకి రూ.10 చొప్పున ఇచ్చి పంపుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. మీ ఊర్లోనూ ఈ పరిస్థితి ఉందా?