News October 15, 2025
MBNR: PUలో 4వ స్నాతకోత్సవం.. నిబంధనలు ఇవే!

✒PhD అవార్డు, బంగారు పతక గ్రహీతలను మాత్రమే గ్రంథాలయం ఆడిటోరియంలోనికి అనుమతి
✒బంగారు పతక విజేతలు, తల్లిదండ్రులకు ప్రవేశ పాసులు జారీ
✒విద్యార్థుల తల్లిదండ్రులు, PU సిబ్బందికి, మేనేజ్మెంట్ సభ్యులకు ప్రత్యక్షంగా వీక్షేందుకు ఫార్మసీ కళాశాల ఆడిటోరియంలో ప్రత్యేక ఏర్పాట్లు
✒విద్యార్థులు, ఇతరులు ఇండోర్ కాంప్లెక్స్లో డిజిటల్ తెరపై చూసే వెసులుబాటు
✒ఫొటోలు, సెల్ఫీ పాయింట్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు
Similar News
News October 15, 2025
అన్నవరం విషయంలో ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్య పోరు..?

అన్నవరం ఆలయం విషయంలో తుని, ప్రత్తిపాడు MLAల మధ్య ఆధిపత్య పోరు నెలకొందని చర్చ సాగుతోంది. తుని ఎమ్మెల్యే యనమల దివ్య సిఫారుసులతో సుబ్బారావును ఈవోగా నియమించారని టాక్. అప్పటి నుంచి ఆలయంలో సత్యప్రభ కంటే దివ్య మాటే చెల్లుబాటవుతుందని ఆమె అనుచరులు ఆరోపిస్తున్నారు. లోకల్ MLA ఉండగా దివ్య పెత్తనం చేయడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. చివరికి ఈ వ్యవహారం ఈవోను బదిలీ చేయించేదాకా వెళ్లిందని ప్రచారం సాగుతోంది.
News October 15, 2025
సంగం టీచర్, విద్యార్థికి అరుదైన అవకాశం

నెల్లూరు జిల్లా సంగం జడ్పీ స్కూల్ సోషల్ టీచర్ సుబ్రహ్మణ్యం, పదో తరగతి విద్యార్థి యశ్వంత్కు అరుదైన అవకాశం దక్కింది. కర్నూలులో పీఎం మోదీ ఆధ్వర్యంలో గురువారం జరగనున్న జీఎస్టీ రీఫార్మ్ 2.0 సభకు వీరిద్దరూ ఎంపికయ్యారు. జీఎస్టీ తగ్గింపుతో కలిగే ప్రయోజనాలను ప్రధాని సభా ప్రాంగణంలో వీరిద్దరూ వివరించనున్నారు. ఈక్రమంలో కర్నూలుకు బయల్దేరి వెళ్లారు.
News October 15, 2025
నవంబర్ నుంచి క్షేత్రస్థాయిలో తనిఖీలు: CBN

AP: పథకాల అమలుపై నవంబర్ నుంచి క్షేత్రస్థాయిలో తనిఖీ చేస్తానని CM CBN వెల్లడించారు. ‘సుపరిపాలన అందిస్తున్నాం. సంక్షేమ పథకాలు, GST సంస్కరణల లబ్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అధికారులు థియేటర్లలో స్లైడ్స్ ప్రదర్శించాలి. టెక్నాలజీ డేటాను ఆడిట్ చేసి ప్రజల సంతృప్తి స్థాయి తెలుసుకుంటా. అధికారులిచ్చే సమాచారానికి వాస్తవాలకు పొంతన ఉండాలి’ అని సూచించారు. కొన్ని పార్టీల కుట్రలను టెక్నాలజీతో బయట పెట్టామన్నారు.