News October 15, 2025
సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి: డీఎంహెచ్ఓ

వర్షాల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున క్షేత్రస్థాయిలో పారామెడికల్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సిద్దిపేట డీఎంహెచ్ఓ డాక్టర్ ధనరాజ్ సూచించారు. మంగళవారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో సిబ్బందితో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాలు, పట్టణాల్లో గర్భిణీ స్త్రీల నమోదును 12 వారాల్లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజలకు అవసరమైన ఆరోగ్య సేవలు అందించాలని సూచించారు.
Similar News
News October 15, 2025
స్పామ్ కాల్స్ రావొద్దంటే ఇలా చేయండి!

గత కొన్నేళ్లుగా స్పామ్ కాల్స్ విపరీతంగా పెరిగిపోయాయి. లోన్లు, క్రెడిట్ కార్డులు ఇస్తాం అంటూ పదేపదే కాల్స్ చేస్తూ విసిగిస్తున్నారు. అలాంటి కాల్స్ రాకుండా ఉండేందుకు ఇప్పటికే ట్రాయ్ DND (Do Not Disturb) అనే విధానం తీసుకొచ్చింది. 1909 నంబర్కు కాల్ లేదా SMS చేసి టెలిమార్కెటింగ్ కాల్స్ రాకుండా బ్లాక్ చేయవచ్చు. లేదా DND యాప్ నుంచి నేరుగా టెలి కమ్యూనికేషన్ విభాగానికి ఫిర్యాదు చేయవచ్చు.
Share it
News October 15, 2025
ఇల్లందు: సింగరేణి అభివృద్ధికి మేధోమథనం

సింగరేణి సంస్థ భవిష్యత్తులో 100 మిలియన్ టన్నుల వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యం దిశగా పయనించడానికి భవిష్యత్ ప్రణాళికపై మేధోమథన కార్యక్రమాన్ని నిర్వహించారు. సీఎండీ బలరాం ఆదేశాల మేరకు ఇల్లందు హెడ్ ఆఫీస్లో సీపీపీ, హెచ్ఆర్డీ విభాగాల ఆధ్వర్యంలో జనరల్ మేనేజర్ మనోహర్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఇందులో డైరెక్టర్లు, పదవీ విరమణ పొందిన డైరెక్టర్లు పాల్గొన్నారు.
News October 15, 2025
మహిళల అభ్యున్నతికి ప్రణాళిక రూపొందించాలి: కలెక్టర్

భద్రాచలం ఐటీడీఏ కార్యాలయాన్ని కలెక్టర్ జితేష్ వి పాటిల్, ప్రాజెక్ట్ అధికారి రాహుల్, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠతో కలిసి బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు ఎన్ఆర్సీ, నాయకపోడు మాస్కుల తయారీ కేంద్రం, గిరిజన భవనం, గిరి బజార్లను పరిశీలించారు. ఐటీడీఏ భవనాలలో గిరిజన మహిళలకు సంక్షేమ పథకాలు, కల్చరల్ పెయింటింగ్, ఇతర అంశాలపై శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ సూచించారు.