News October 15, 2025

MBNR: పత్తి అమ్మకాలకు ‘స్లాట్’ నిబంధన!

image

పత్తి కొనుగోళ్లలో దళారుల అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు CCI కొత్తగా స్లాట్ బుకింగ్ విధానాన్ని తీసుకొచ్చింది. ‘కపాస్ కిసాన్’ యాప్‌తో రైతులు తమ అమ్మకాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధానంతో రైతులకు నిరీక్షణ తప్పనుంది. యాప్ ప్రచారంలో వ్యవసాయ శాఖ వైఫల్యం చెందడంతో, ఈ విధానం ఎంతవరకు విజయవంతమవుతుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వివరాలకు CCI వాట్సాప్ 8897281111, టోల్‌ఫ్రీ 18005995779ను ఏర్పాటు చేసింది.

Similar News

News October 16, 2025

ఉద్యోగులకు సీపీఆర్‌పై అవగాహన ఉండాలి: డీఎంహెచ్వో

image

ప్రతి ఉద్యోగికి సీపీఆర్‌పై అవగాహన ఉండాలని డీఎంహెచ్వో గోపాలరావు అన్నారు. ములుగు కలెక్టరేట్‌లో సీపీఆర్‌పై అవగాహన కల్పించారు. మనిషికి మానసిక ఒత్తిడి కారణంగా మెదడుకు రక్తప్రసరణ జరగక గుండె కొట్టుకోవడం ఆగిపోతుందన్నారు. అప్పుడు సీపీఆర్ ప్రక్రియ చేయాలని, దీని ద్వారా గుండె కొట్టుకోవడంతో పాటు మనిషి కోలుకోవడానికి సహాయపడుతుందన్నారు.

News October 16, 2025

ఈనెల 25నాటికి ఈ-పంట నమోదు పూర్తి చేయాలి: జేసీ

image

బాణాసంచా తయారీ కేంద్రాలలో తనిఖీలు నిర్వహించాలని అనకాపల్లి జిల్లా జేసీ ఎం.జాహ్నవి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అధికారులతో జేసీ మాట్లాడారు. బాణాసంచా తయారీ కేంద్రాల్లో భద్రతా లోపాలను గుర్తించాలన్నారు. ఓటర్ లిస్టులకు సంబంధించి వెరిఫికేషన్ పూర్తి చేసి మ్యాపింగ్ పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.

News October 16, 2025

గద్వాల్: ‘అక్రమంగా మట్టి తరలిస్తున్నా పట్టించుకోని అధికారులు’

image

జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలో మట్టి దందా ఆగడం లేదు. పట్టపగలే అక్రమంగా మట్టిని తవ్వి తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. కొందరు ట్రాక్టర్‌ను ఆపి డ్రైవర్‌ను అడగగా రాజకీయ పార్టీ నాయకుల పేర్లు చెప్పాడు. రాజకీయ నాయకుల అండతో అక్రమ దందా జోరుగా సాగుతోంది. కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.