News October 15, 2025
KMR: పేకాటపై ఉక్కుపాదం.. 18 మంది అరెస్ట్

కామారెడ్డి జిల్లాలో మంగళవారం పోలీసులు మూడు వేర్వేరు ప్రాంతాల్లోని పేకాట స్థావరాలపై దాడులు నిర్వహించి 18 మందిని అరెస్ట్ చేశారు. పిట్లం మండలం చిల్లర్గిలో 9 మందిని అరెస్ట్ చేసి రూ.4,030 నగదు, 6 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నస్రుల్లాబాద్ మండలంలో ఐదుగురిని పట్టుకొని రూ.1,250 నగదు, 4 ఫోన్లు, 2 బైకులు స్వాధీనం చేసుకోగా లింగంపేట్ మండలంలో నలుగురిని అదుపులోకి తీసుకోని రూ.6,400 పట్టుకున్నారు.
Similar News
News October 15, 2025
నిర్ధిష్ట సమయంలో రోడ్ల నిర్మాణం: వీఎంఆర్డీఏ ఛైర్మన్

మాస్టర్ ప్లాన్ రహదారులను నిర్ధిష్ట సమయంలో పూర్తి చేయాలని వీఎంఆర్డీఏ ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ ఆదేశించారు. అర్హులైన వారికి టీడీఆర్ ఇవ్వాలన్నారు. సమస్యలు లేని చోట్ల రహదారుల నిర్మాణాన్ని ప్రారంభించాలన్నారు. అటవీ శాఖ నుంచి అనుమతులు తీసుకోవాలన్నారు. భోగాపురం విమానాశ్రయాన్ని అనుసంధానించే <<18005420>>రోడ్డు నిర్మాణం<<>> వేగవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కమిషనర్ రమేశ్, సీఈ వినయ్ కుమార్ పాల్గొన్నారు.
News October 15, 2025
పరిశోధనలే సమాజానికి దిక్సూచి: ఎంజీయూ వీసీ

విద్యాలయాలలో జరిగే పరిశోధనలే సమాజానికి సరైన దిశానిర్దేశం చేస్తాయని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం (ఎంజీయూ) ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. 2028లో జరగనున్న మూడో విడత నాక్ మూల్యాంకనంపై ఐక్యూఏసీ ఆధ్వర్యంలో జరిగిన సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. పరిశోధనల నాణ్యత పెంచాలని ఉపాధ్యాయులకు, విద్యార్థులకు సూచించారు.
News October 15, 2025
నిర్మల్: మద్యం షాపులకు 42 దరఖాస్తులు

నిర్మల్ జిల్లాలోని 47 మద్యం దుకాణాలకు బుధవారం 42 దరఖాస్తులు వచ్చాయని డీపీఈవో అబ్దుల్ రజాక్ తెలిపారు. గత పాలసీలో 701 దరఖాస్తులు వచ్చాయని, ఈ సారి ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. చివరి రోజు వరకు వేచి చూడకుండా ముందుగానే దరఖాస్తులు దాఖలు చేయాలని విజ్ఞప్తి చేశారు. దరఖాస్తు ఫారాలను ఉచితంగా అందజేయనున్నట్లు తెలిపారు. దరఖాస్తులను ఈ నెల 18 వరకు స్వీకరించనున్నట్లు వెల్లడించారు.