News October 15, 2025

29న పోలవరం, దేవాదులపై పీఎం సమీక్ష

image

తెలుగు రాష్ట్రాల్లో గోదావరి నదిపై చేపట్టిన దేవాదుల, పోలవరం ప్రాజెక్టులపై ప్రధాని మోదీ ఈనెల 29న సమీక్షించనున్నారు. ఈ ప్రాజెక్టుల బ్యాక్ వాటర్ ముంపుపై ప్రభావిత రాష్ట్రాలు లేవనెత్తిన అభ్యంతరాలు, భూసేకరణ, పునరావాసంపై ‘ప్రగతి’ కార్యక్రమంలో చర్చించనున్నారు. APలో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు 60% పూర్తికాగా TGలో దేవాదుల పనులు 92% మేర పూర్తయ్యాయి. వీటిపై PM చర్చించి తగిన ఆదేశాలు జారీ చేసే అవకాశముంది.

Similar News

News October 15, 2025

పప్పులో కాలేసిన ఇన్వెస్టర్లు.. LG అనుకొని!

image

దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజం ‘LG ఎలక్ట్రానిక్స్‌’ స్టాక్‌మార్కెట్‌లో అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. ఈక్రమంలో ఇన్వెస్టర్లు షేర్లు కొనేందుకు ఎగబడ్డారు. అయితే చాలామంది సరైన కంపెనీని సెర్చ్ చేయకుండా పప్పులో కాలేశారు. LG ఎలక్ట్రానిక్స్‌కి బదులు పొరపాటున LG బాలకృష్ణన్ & బ్రదర్స్ లిమిటెడ్ షేర్లు కొనేశారు. దీంతో ఈ కంపెనీ షేర్లు ఒక్కసారిగా 20% పెరిగిపోయినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

News October 15, 2025

రేపు ఏపీలో పర్యటిస్తున్నా: మోదీ

image

గురువారం ఏపీలో పర్యటించనున్నట్లు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ముందుగా శ్రీశైలంలోని భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం కర్నూలులో రూ.13,400 కోట్ల విలువైన అభివృద్ధి, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొంటానని పేర్కొన్నారు. అంతకుముందు అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనేందుకు ప్రధాని ఏపీలో పర్యటించిన సంగతి తెలిసిందే.

News October 15, 2025

ఇతిహాసాలు క్విజ్ – 36 సమాధానాలు

image

1. దశరథుడి తల్లి ఇందుమతి.
2. పాండవులు ఒక సంవత్సరం అజ్ఞాతవాసంలో ఉంటారు.
3. విష్ణువు ధనస్సు పేరు ‘సారంగం’.
4. తెలంగాణలోని భద్రాచలం ఆలయం గోదావరి నది ఒడ్డున ఉంది.
5. శుక అంటే చిలుక అని అర్థం.
<<-se>>#Ithihasaluquiz<<>>