News October 15, 2025
ప్రభుత్వం వినూత్న నిర్ణయం.. ఖమ్మం నుంచే షురూ..!

ప్రభుత్వం పచ్చదనంతో పాటు ఆదాయం కోసం వినూత్న నిర్ణయం తీసుకుంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆలోచనతో ప్రభుత్వ స్థలాలు, రహదారులు, బీడు భూముల్లో ఆయిల్పామ్ మొక్కలు పెంచి పచ్చదనంతో పాటు ఆదాయం పొందేందుకు కార్యచరణ సిద్ధం చేస్తోంది. ఉమ్మడి ఖమ్మంను మోడల్గా తీసుకుని అన్ని ప్రభుత్వ విభాగాలలో ఖాళీ స్థలాలను గుర్తిస్తున్నారు. ఈ స్థలాల్లో మొక్కలను నాటడం ద్వారా అన్ని ప్రభుత్వ శాఖలకు ఆదాయం లభించనుంది.
Similar News
News October 16, 2025
నల్గొండ: దీపావళి వేళ.. ACBకి పట్టుబడిన అధికారి

దీపావళి సందర్భంగా క్రాకర్స్ షాపు అనుమతి కోసం లంచం తీసుకుంటుండగా అగ్నిమాపక శాఖ కార్యాలయంలో ఒక అధికారి ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. షాపు నిర్వాహకుడి వద్ద రూ.8,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. కార్యాలయంలో తనిఖీలు చేపట్టిన ఏసీబీ బృందం అధికారిని విచారిస్తోంది. పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.
News October 16, 2025
పెండింగ్ దరఖాస్తులు పరిష్కరించాలి: కలెక్టర్

రెవెన్యూకు సంబంధించిన పెండింగ్ దరఖాస్తులను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని KMR కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. భూభారతి దరఖాస్తులు, ప్రజావాణి విజ్ఞప్తులు తదితర 16 అంశాలపై కలెక్టర్ రివ్యూ చేశారు. రెవెన్యూ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించరాదని సూచించారు. అదనపు కలెక్టర్ విక్టర్, సబ్ కలెక్టర్ కిరణ్మయి ఉన్నారు.
News October 16, 2025
ASF: గురుకులాల్లో ఖాళీ సీట్ల భర్తీకి దరఖాస్తులు

జిల్లాలోని సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలలో 6, 7, 8, 9 తరగతుల్లోని ఖాళీ సీట్ల భర్తీకి విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించినట్లు జిల్లా సమన్వయ అధికారి యాదగిరి తెలిపారు. ఆసిఫాబాద్ (బాలురు), రెబ్బెన (బాలికల), సిర్పూర్ టి (బాలికల), కాగజ్ నగర్ (బాలికల) పాఠశాలల్లో ఖాళీలు ఉన్నాయన్నారు. BLV సెట్ ఎంట్రెన్స్ 2025 రాసి మెరిట్ లిస్టులో పేరు ఉన్న విద్యార్థులు అర్హులని వెల్లడించారు.