News October 15, 2025

గూగుల్‌తో విశాఖ రూపురేఖలే మారిపోతాయ్: లోకేశ్

image

గూగుల్ డేటా సెంటర్ విశాఖ రూపురేఖలనే మార్చేస్తుందని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. ఇది కేవలం డేటా సెంటర్ కాదని.. దీంతో ఏఐకి సంబంధించిన అనేక కంపెనీలు విశాఖ వస్తున్నట్లు చెప్పారు. ఉత్తరాంధ్రలో టీసీఎస్, కాగ్నిజెంట్, యాక్సెంచర్ వంటి కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయన్నారు. నవంబర్‌లోనే టీసీఎస్ వస్తుందని, డిసెంబర్‌లో కాగ్నిజెంట్ పనులు ప్రారంభిస్తుందన్నారు.

Similar News

News October 15, 2025

అన్నవరం విషయంలో ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్య పోరు..?

image

అన్నవరం ఆలయం విషయంలో తుని, ప్రత్తిపాడు MLAల మధ్య ఆధిపత్య పోరు నెలకొందని చర్చ సాగుతోంది. తుని ఎమ్మెల్యే యనమల దివ్య సిఫారుసులతో సుబ్బారావును ఈవోగా నియమించారని టాక్. అప్పటి నుంచి ఆలయంలో సత్యప్రభ కంటే దివ్య మాటే చెల్లుబాటవుతుందని ఆమె అనుచరులు ఆరోపిస్తున్నారు. లోకల్ MLA ఉండగా దివ్య పెత్తనం చేయడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. చివరికి ఈ వ్యవహారం ఈవోను బదిలీ చేయించేదాకా వెళ్లిందని ప్రచారం సాగుతోంది.

News October 15, 2025

సంగం టీచర్, విద్యార్థికి అరుదైన అవకాశం

image

నెల్లూరు జిల్లా సంగం జడ్పీ స్కూల్ సోషల్ టీచర్ సుబ్రహ్మణ్యం, పదో తరగతి విద్యార్థి యశ్వంత్‌కు అరుదైన అవకాశం దక్కింది. కర్నూలులో పీఎం మోదీ ఆధ్వర్యంలో గురువారం జరగనున్న జీఎస్టీ రీఫార్మ్ 2.0 సభకు వీరిద్దరూ ఎంపికయ్యారు. జీఎస్టీ తగ్గింపుతో కలిగే ప్రయోజనాలను ప్రధాని సభా ప్రాంగణంలో వీరిద్దరూ వివరించనున్నారు. ఈక్రమంలో కర్నూలుకు బయల్దేరి వెళ్లారు.

News October 15, 2025

నవంబర్ నుంచి క్షేత్రస్థాయిలో తనిఖీలు: CBN

image

AP: పథకాల అమలుపై నవంబర్ నుంచి క్షేత్రస్థాయిలో తనిఖీ చేస్తానని CM CBN వెల్లడించారు. ‘సుపరిపాలన అందిస్తున్నాం. సంక్షేమ పథకాలు, GST సంస్కరణల లబ్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అధికారులు థియేటర్లలో స్లైడ్స్ ప్రదర్శించాలి. టెక్నాలజీ డేటాను ఆడిట్ చేసి ప్రజల సంతృప్తి స్థాయి తెలుసుకుంటా. అధికారులిచ్చే సమాచారానికి వాస్తవాలకు పొంతన ఉండాలి’ అని సూచించారు. కొన్ని పార్టీల కుట్రలను టెక్నాలజీతో బయట పెట్టామన్నారు.