News October 15, 2025

జూబ్లీ బైపోల్: పట్టున్నా.. పోరులో లేదాయే..!

image

జూబ్లీహిల్స్‌ బరిలో ఉన్న అభ్యర్థులకు టెన్షన్ పట్టుకుంది. మొత్తం 3.98 లక్షల మంది ఓటర్లుండగా వీరిలో 96వేల మంది మైనారిటీ ఓటర్లున్నారు. ఈ ఓట్లన్నీ ఎటువైపు పడితే ఆ అభ్యర్థి విజయం సాధిస్తాడనడంలో డౌట్ లేదు. అందుకే ఈ ఓట్ల కోసం ప్రధాన పార్టీలు ప్రయత్నాలు ప్రారంభించాయి. MIMకు పట్టు ఉన్నా పోటీచేయకపోవడంతో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. అంతర్గతంగా కాంగ్రెస్‌కి ఆ పార్టీ మద్దతిస్తున్నట్లు సమాచారం.

Similar News

News October 15, 2025

జూబ్లీహిల్స్ బైపోల్: INCకి వ్యతిరేకంగా 1500 నామినేషన్లు

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి ఊహించని పరిస్థితులు నెలకొన్నాయి. ఉప ఎన్నికలో INCకి వ్యతిరేకంగా 1500 మంది నామినేషన్లు వేసేందుకు సిద్ధమయ్యారు. 1000 మంది నిరుద్యోగులు, 300 మంది RRR భూ బాధితులు, 200 మంది మాల కులస్థులు నామినేషన్ వేయనున్నారు. కాంగ్రెస్‌ని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓడిస్తేనే అధికార అహంకారం తగ్గుతుందని, అప్పుడే చిత్తశుద్ధితో పని చేస్తారని పోటీదారులు పేర్కొంటున్నారు.

News October 15, 2025

HYD: స్వీట్ షాపుల్లో తనిఖీలు

image

GHMC ఫుడ్ సేఫ్టీ కంట్రోలర్ మూర్తి రాజ్ ఆధ్వర్యంలో గ్రేటర్‌లోని పలు స్వీట్ షాపుల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. దీపావళి పండుగ నేపథ్యంలో ఈ రైడ్స్ నిర్వహించినట్లు తెలిపారు. కనీస రూల్స్ పాటించని వ్యాపారుల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని షాప్‌లకు నోటీసులు జారీ చేశారు. శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపించామని మూర్తి రాజ్ వెల్లడించారు. సిటీలోని మొత్తం 43 స్వీట్ షాపుల్లో ఈ తనికీలు కొనసాగాయి.

News October 15, 2025

HYD: బైక్‌ మీద వెళితే.. కుక్కలతో జాగ్రత్త!

image

టూ వీలర్‌పై వెళుతున్నపుడు వాహనం కంట్రోల్‌లో ఉండాలి. కుక్కలు కూడా సిటీలో వాహనచోదకులను ఇబ్బంది పెడుతున్నాయి. వీధి కుక్కలు అప్పుడప్పుడు రోడ్లపై సడన్‌గా బండికి అడ్డంగా వస్తుంటాయి. అప్పుడు బైక్ కంట్రోల్ కాకపోతే ప్రమాదాలకు గురవుతాం. ఒక్కోసారి ప్రాణాలు కూడా పోతాయి. ఇలా నిన్న తుకారాంగేట్ వద్ద ప్రాణాలు కోల్పోయింది అడ్డగుట్టకు చెందిన స్వప్న (42). భర్తతో కలిసి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. సో.. జాగ్రత్త.