News October 15, 2025
భద్రాద్రి జిల్లాలో 193 ధాన్యం కొనుగోలు కేంద్రాలు

భద్రాద్రి జిల్లాలో వానాకాలం ధాన్యం కొనుగోలు కోసం 193 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. జిల్లాలో 2,02,862 మెట్రిక్ టన్నుల సన్నరకం, 35,315 మెట్రిక్ టన్నుల దొడ్డురకం ధాన్యం ఉంటాయని చెప్పారు. అవసరాన్ని బట్టి అదనపు కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. సన్నరకానికి అదనంగా రూ.500 ఇస్తామని కలెక్టర్ పేర్కొన్నారు.
Similar News
News October 17, 2025
TODAY HEADLINES

✦ ఏపీలో ప్రధాని మోదీ పర్యటన.. రూ.13,429 కోట్ల ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు
✦ మోదీతో ఇండియా ప్రతిష్ఠ ఎంతో పెరిగింది: CM CBN
✦ AIకు AP తొలి గమ్యస్థానంగా మారనుంది: మోదీ
✦ BC రిజర్వేషన్లపై TG ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
✦ ఈ నెల 18న TG బంద్కు మద్దతు ప్రకటించిన కాంగ్రెస్
✦ క్యాబినెట్ భేటీకి మంత్రి కొండా సురేఖ గైర్హాజరు
✦ AUSలో ప్రాక్టీస్ ఆరంభించిన రోహిత్, కోహ్లీ
News October 17, 2025
నగరాలను దాటి గ్రామాల దిశగా ‘ఆతిథ్యం’

‘ఆతిథ్యం’ అంటే నగరాల్లోని స్టార్ హొటళ్లు, దర్శనీయ స్థలాలు మాత్రమే అన్నట్లుండేది. ఇపుడా రంగం టైప్1 నగరాలను దాటి చిన్న పట్టణాల వైపు విస్తరిస్తోంది. HVS ANAROCK డేటా ప్రకారం JAN-APR మధ్య జరిగిన ఒప్పందాల్లో 73.3% టైర్2(31.6), టైర్3, 4(41.7) సిటీల్లో జరిగాయి. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే గణనీయమైన పెరుగుదల ఉంది. ప్రాంతీయ పండగలు, డెస్టినేషన్ వెడ్డింగ్స్, కార్పొరేట్ రీట్రీట్స్, సమ్మిట్స్తో కళకళలాడుతోంది.
News October 17, 2025
NRPT: గోల్డ్ మెడల్ అందుకున్న పేదింటి అమ్మాయి

పాలమూరు యూనివర్సిటీ 4వ స్నాతకోత్సవంలో భాగంగా దామరగిద్ద మండలం కానుకుర్తి గ్రామానికి చెందిన పూజారి తులసి గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ చేతుల మీదుగా ఈరోజు గోల్డ్ మెడల్ అందుకుంది. పీయూ పీజీ సెంటర్ గద్వాలలో ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్ 2024 గాను పతకం అందుకుంది. 10th క్లాస్ గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుకుంది. పేద కుటుంబానికి చెందిన తులసికి గోల్డ్ మెడల్ రావడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.