News October 15, 2025

ప్రముఖ నటుడు కన్నుమూత

image

వెటరన్ బాలీవుడ్ యాక్టర్ పంకజ్ ధీర్(68) కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన నిన్న తుదిశ్వాస విడిచినట్లు సినీ& TV ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. ఇవాళ సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపింది. 1988-94 మధ్య BR చోప్రా తెరకెక్కించిన ‘మహాభారత్’ టీవీ సీరియల్‌లో కర్ణుడి పాత్రతో పంకజ్ గుర్తింపు పొందారు. పలు బాలీవుడ్ సినిమాలు, టీవీ సీరియళ్లలో ఆయన నటించారు.

Similar News

News October 16, 2025

లేటెస్ట్ సినిమా అప్‌డేట్స్

image

▸సుధీర్ బాబు నటించిన ‘జటాధర’ సినిమా ట్రైలర్‌ను రేపు విడుదల చేయనున్న మహేశ్ బాబు
▸వెట్రిమారన్, శింబు కాంబోలో వస్తోన్న ‘అరసన్'(తెలుగులో సామ్రాజ్యం) సినిమా ప్రోమోను రేపు రిలీజ్ చేయనున్న Jr.NTR
▸విక్రమ్ కె.కుమార్ డైరెక్షన్‌లో విజయ్ దేవరకొండ సినిమా చేసే అవకాశం?
▸ మెటా AIకి దీపికా పదుకొణె వాయిస్.. తొలి ఇండియన్ సెలబ్రిటీగా రికార్డు

News October 16, 2025

PHOTO GALLERY: మోదీ ఏపీ పర్యటన

image

AP: ప్రధాని మోదీ ఇవాళ ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించారు. తొలుత శ్రీశైలంలో భ్రమరాంబికా దేవి, మల్లికార్జున స్వామి వార్లకు పూజలు చేశారు. అనంతరం గవర్నర్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్, కేంద్రమంత్రులు రామ్మోహన్, పెమ్మసాని, భూపతి రాజులతో కలిసి బహిరంగ సభలో పాల్గొన్నారు. మోదీ పర్యటన ఫొటోలను పైన గ్యాలరీలో చూడండి.

News October 16, 2025

3 కొత్త అగ్రికల్చర్ కాలేజీలు.. ఇక్కడే

image

TG: జయశంకర్ వర్సిటీకి అనుబంధంగా కొత్తగా 3 వ్యవసాయ కళాశాలల ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. నల్గొండ, నిజామాబాద్, వికారాబాద్ జిల్లాల్లో ఈ కాలేజీలను నిర్మించనుంది. అటు రూ.10,500 కోట్లతో 5,500 కిలోమీటర్ల హ్యామ్ రోడ్ల నిర్మాణానికి మంత్రివర్గం పచ్చజెండా ఊపింది.