News October 15, 2025
MBNR: బీసీలందరూ ఐక్యంగా పోరాడాలి: తీన్మార్ మల్లన్న

బీసీలందరూ ఐక్యంగా పోరాడాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, MLC తీన్మార్ మల్లన్న పిలుపునిచ్చారు. ఈరోజు MBNRలో TRP ఆధ్వర్యంలో ఎర్ర సత్యంకు ఘన నివాళులర్పించారు. అనంతరం తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. బీసీలందరం ఏకతాటిపైకి వస్తేనే రాజ్యాధికారం సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ ఐక్యవేదిక నాయకులు, తీన్మార్ మల్లన్న టీం సభ్యులు, తెలంగాణ ఇంటలెక్చువల్ ఫోరం సభ్యులు, జర్నలిస్టులు పాల్గొన్నారు.
Similar News
News October 15, 2025
జూబ్లీహిల్స్ బైపోల్: INCకి వ్యతిరేకంగా 1500 నామినేషన్లు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి ఊహించని పరిస్థితులు నెలకొన్నాయి. ఉప ఎన్నికలో INCకి వ్యతిరేకంగా 1500 మంది నామినేషన్లు వేసేందుకు సిద్ధమయ్యారు. 1000 మంది నిరుద్యోగులు, 300 మంది RRR భూ బాధితులు, 200 మంది మాల కులస్థులు నామినేషన్ వేయనున్నారు. కాంగ్రెస్ని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓడిస్తేనే అధికార అహంకారం తగ్గుతుందని, అప్పుడే చిత్తశుద్ధితో పని చేస్తారని పోటీదారులు పేర్కొంటున్నారు.
News October 15, 2025
గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే ల్యాండ్ ఆక్విజిషన్పై సమీక్ష

గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే 163జీ పనుల ల్యాండ్ ఆక్విజిషన్ పురోగతిపై వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ జి. సంధ్యారాణి, డీఆర్వో విజయ లక్ష్మి, ఆర్డీఓ నర్సంపేట ఉమారాణి, నేషనల్ హైవే పీడీ దివ్యతో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
News October 15, 2025
నానాజీ తనయుడి రిసెప్షన్కు కలెక్టర్, ఎస్పీ

కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తనయుడు సందీప్ వివాహ రిసెప్షన్ బుధవారం రాత్రి స్థానిక లిటిల్ బర్డ్స్ స్కూల్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ షాన్మోహన్, ఎస్పీ బిందు మాధవ్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు. అతిథులుగా విచ్చేసిన వారికి ఎమ్మెల్యే నానాజీ కృతజ్ఞతలు తెలియజేశారు.