News October 15, 2025
వనపర్తి: ‘కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు లేకుండా చూడండి’

గత రెండు సీజన్ల మాదిరిగానే ఖరీఫ్ 2025-26 సీజన్లో కూడా రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వరి ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం సంబంధిత అధికారులతో కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. గతంలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఇబ్బందులు కలిగిన కేంద్రాల్లో మళ్లీ ఇబ్బందులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
Similar News
News October 17, 2025
విడిపోయినా కలవొచ్చు..

హిందూ వివాహ చట్టం-1955, సెక్షన్-9 ద్వారా విడిపోయిన భార్యాభర్తలు తిరిగి వివాహ బంధాన్ని పునరుద్ధరింపజేయమని కోరవచ్చు. సెక్షన్-10 ప్రకారం బంధం చెడకుండా విడివిడిగా ఉండటానికి న్యాయస్థానం ద్వారా అనుమతి కోరవచ్చు. న్యాయసేవల అధికారిక చట్టం ద్వారా స్త్రీలు, పిల్లలు ఉచిత న్యాయసేవలను పొందొచ్చు. ఎవరైనా మహిళను విచారణ జరిపేటప్పుడు ఆమె నివాసంలో, కుటుంబ సభ్యుల సమక్షంలో జరపాలి.
News October 17, 2025
ఆందోల్: ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

ఆందోల్ మండలం చింతకుంట గ్రామ సమీపంలోని బ్రిడ్జిపై నుంచి ఇంటర్ విద్యార్థి దూకి గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. రాళ్లపాడు గ్రామానికి చెందిన రాములు కుమారుడు జగన్ (17) ఇస్నాపూర్ సమీపంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బైపీసీ చదువుతున్నాడు. జగన్ కళాశాలకు రావడంలేదని ప్రిన్సిపల్ ఫోన్ చేసి జగన్ తండ్రికి చెప్పడంతో మందలించాడు. మనస్థాపానికి గురైన జగన్ బ్రిడ్జిపై నుంచి వాగులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
News October 17, 2025
కర్నూలు మోదీ సభ హైలైట్స్

★ చంద్రబాబు నాయకత్వంలో సరికొత్త శక్తిగా ఏపీ: పీఎం మోదీ
★ మోదీ సంస్కరణలు గేమ్ చేంజర్లు: సీఎం
★ మోదీ ఓ కర్మయోగి.. మరో 15ఏళ్లు కూటమి పాలన: డిప్యూటీ సీఎం
★ ప్రధాని కోరినవన్నీ ఇస్తున్నారు: లోకేశ్
★ అఖండ భారతావని బాగుండాలని శ్రీశైలంలో మోదీ పూజలు
★ లోకేశ్కు ప్రధాని కితాబు.. సరదా ముచ్చట
★ ₹13,429 కోట్ల పనులకు శ్రీకారం
★ టైం అంటే టైం.. షెడ్యూల్ ప్రకారమే సాగిన పర్యటన
★ సభలో 2 లక్షల మంది పాల్గొన్నారని అంచనా