News October 15, 2025
సీఎం ఆడిన మైదానం అభివృద్ధికి నిధులు: వనపర్తి ఎమ్మెల్యే

సీఎం రేవంత్ రెడ్డి వనపర్తి జూనియర్ కాలేజీ మైదానంలో ఆటలు ఆడారని, మైదానం, అభివృద్ధికి నిధులు మంజూరు చేశారన్నారు. వనపర్తిలో జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ ప్రారంభంలో ఆయన మాట్లాడారు. ఇదే మైదానంలో సీఎం రేవంత్ రెడ్డి ఆటలు ఆడారని, మైదానం అభివృద్ధికి రూ.50కోట్లు , జిమ్ స్విమ్మింగ్కు రూ.15కోట్లు మంజూరు చేశారన్నారు. క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని, ఓడిపోయిన ప్రతిసారి పట్టుదలతో ప్రయత్నించి విజయం సాధించాలన్నారు.
Similar News
News October 17, 2025
MBNR: రూ.12 కోట్ల విరాళాన్ని ప్రకటించిన ఏంఎస్ఎన్ రెడ్డి

పాలమూరు విశ్వవిద్యాలయంలోని ఆడిటోరియం నిర్మాణం కోసం మన్నె సత్యనారాయణ రెడ్డి రూ.12 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. 4వ స్నాతకోత్సవ కార్యక్రమంలో ఆయన భావోద్వేగంగా మాట్లాడుతూ.. ‘ఈ నేల పుట్టిన బిడ్డగా పాలమూరు విశ్వవిద్యాలయం వేదికపై మాట్లాడటం నాకు గొప్ప గౌరవంగా ఉంది. ఒకప్పుడు వలసల కోసం పేరుగాంచిన పాలమూరు, ఇప్పుడు విద్య, ఆరోగ్యం, పరిశ్రమల రంగాల్లో అభివృద్ధి సాధించడం గర్వకారణం’ అని అన్నారు.
News October 17, 2025
యూసుఫ్గూడ: అవిభక్త కవలలు వీణా-వాణిల పుట్టినరోజు వేడుకలు

అవిభక్త కవలలు వీణా-వాణిల 23వ జన్మదిన వేడుకలను యూసుఫ్గూడలోని స్టేట్ హోమ్లో గురువారం నిర్వహించారు. తమ పిల్లల సంరక్షణ బాధ్యతను ప్రభుత్వం తీసుకొని తమను ఆదుకుంటుందని తల్లిదండ్రులు తెలిపారు. అలాగే, వైద్యరంగంలో జరిగిన అభివృద్ధితో తమ బిడ్డలైన అవిభక్త కవలలను విడదీసి సంపూర్ణ ఆరోగ్యంతో తమకు అప్పగించాలని కోరుతున్నారు.
News October 17, 2025
గుండ్లకమ్మ ప్రాజెక్టుపై అధికారులకు కలెక్టర్ సూచనలు

గుండ్లకమ్మ ప్రాజెక్ట్ కింద 50 ఎకరాల భూసేకరణ చేయకపోవడంతోనే బాపట్ల జిల్లాలోని 13,876 ఎకరాలకు సాగునీరు రావడంలేదని కలెక్టర్ వినోద్ కుమార్ గురువారం చెప్పారు. ఇంకొల్లు మండలం దుద్దుకూరులో 50 ఎకరాల భూసేకరణ పనులు నిలిచిపోవడంపై ఆరా తీశారు. తక్షణమే భూ సేకరణకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం గుండ్లకమ్మ ప్రాజెక్ట్ 14 గేట్లు మరమ్మతులు పూర్తి కాగా, మరొకదానికి పనులు జరుగుతున్నాయన్నారు.