News October 15, 2025
కేసుల త్వరగా పరిష్కరించాలి: రామగుండం సీపీ

క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, కేసుల పరిష్కార శాతం పెంపు, పాత/దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న (UI&PT)కేసుల త్వరగా పరిష్కరించాలని సీపీ అంబర్ కిషోర్ ఝా అన్నారు. MNCLజోన్ పోలీస్ అధికారులతో బుధవారం నేర సమీక్ష నిర్వహించారు. అందుబాటులో ఉన్న టెక్నాలజీతో పాటు, శాస్త్రీయ పద్ధతిని కూడా అనుసరిస్తూ దర్యాప్తు చేపట్టాలన్నారు. నిందితులకు కోర్టులో శిక్షలు పడే విధంగా సాక్షాదారాలను కోర్టుకు అందజేయాలని సూచించారు.
Similar News
News October 17, 2025
విశాఖ సెంట్రల్ జైలుకు ఎచ్చెర్ల MPP

ఎచ్చెర్ల MPP చిరంజీవిని బుధవారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అతనిపై రెండేళ్లుగా 14 కేసులు నమోదయ్యాయని, అతను చెడు వ్యవసనాలతో ప్రజల పట్ల దురుసుగా ప్రవర్తిస్తుండడంతో అరెస్ట్ చేసినట్లు జిల్లా SP కేవీ మహేశ్వరరెడ్డి తెలిపారు. అతనిపై PD యాక్ట్ నమోదు చేయాలని ఎచ్చెర్ల పోలీసులు జిల్లా కార్యాలయానికి ప్రతిపాదనలు పంపించినట్లు తెలిపారు. నిందితుడిని విశాఖ సెంట్రల్ జైలుకు తరలించినట్లు తెలిపారు.
News October 17, 2025
అజిత్రోమైసిన్ సిరప్లో పురుగులు

మధ్యప్రదేశ్లో దగ్గు మందు మరణాల తర్వాత అజిత్రోమైసిన్ సిరప్లో పురుగులు రావడం కలకలం రేపుతోంది. గ్వాలియర్ జిల్లా మోరార్ ప్రభుత్వాస్పత్రిలో ఇచ్చిన అజిత్రోమైసిన్ యాంటీబయాటిక్ సిరప్లో పురుగులున్నాయని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆస్పత్రిలోని మిగిలిన 306 బాటిల్స్ను సీజ్ చేసి, టెస్ట్ కోసం శాంపిల్స్ భోపాల్ పంపారు. అది జనరిక్ మెడిసిన్ అని, MPలోని ఓ కంపెనీ తయారు చేస్తోందని అధికారులు వెల్లడించారు.
News October 17, 2025
విజయవాడ: విద్యార్థి మృతిపై అనుమానాలు

సింగ్ నగర్లో 9వ తరగతి విద్యార్థి యశ్వంత్ మృతిపై అనుమానాలు నెలకొన్నాయి. బాత్రూమ్లో 2 అడుగుల ఎత్తులో ఉన్న హ్యాంగర్కు ఉరి వేసుకున్నట్లు కనిపించడంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా యశ్వంత్ పేరెంట్స్ విడిపోయారు. తల్లికి క్యాన్సర్ కావడంతో యశ్వంత్ స్కూల్కు సరిగా వెళ్లడం లేదు. చెల్లి దివ్యాంగురాలు. ఈ పరిణామాలతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.