News October 15, 2025
పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా వ్యాసరచన పోటీలు

ఈ నెల 21న పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా వ్యాస రచన పోటీలు నిర్వహించనున్నట్లు WGL పోలీసులు తెలిపారు. ‘పోలీసుల పాత్ర-విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండే మార్గాలు’అనే అంశంపై ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ భాషల్లో వ్యాసరచన పోటీ నిర్వహించనున్నారు. 6వ తరగతి నుంచి పట్టభద్రుల వరకు విద్యార్థులు ఈ పోటీలో పాల్గొనవచ్చన్నారు. పాల్గొనలనుకునేవారు https://forms.gle/jaWLdt2yhNrMpe3eA లింక్ ద్వారా నమోదు చేసుకోవాలన్నారు.
Similar News
News October 17, 2025
విశాఖ సెంట్రల్ జైలుకు ఎచ్చెర్ల MPP

ఎచ్చెర్ల MPP చిరంజీవిని బుధవారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అతనిపై రెండేళ్లుగా 14 కేసులు నమోదయ్యాయని, అతను చెడు వ్యవసనాలతో ప్రజల పట్ల దురుసుగా ప్రవర్తిస్తుండడంతో అరెస్ట్ చేసినట్లు జిల్లా SP కేవీ మహేశ్వరరెడ్డి తెలిపారు. అతనిపై PD యాక్ట్ నమోదు చేయాలని ఎచ్చెర్ల పోలీసులు జిల్లా కార్యాలయానికి ప్రతిపాదనలు పంపించినట్లు తెలిపారు. నిందితుడిని విశాఖ సెంట్రల్ జైలుకు తరలించినట్లు తెలిపారు.
News October 17, 2025
అజిత్రోమైసిన్ సిరప్లో పురుగులు

మధ్యప్రదేశ్లో దగ్గు మందు మరణాల తర్వాత అజిత్రోమైసిన్ సిరప్లో పురుగులు రావడం కలకలం రేపుతోంది. గ్వాలియర్ జిల్లా మోరార్ ప్రభుత్వాస్పత్రిలో ఇచ్చిన అజిత్రోమైసిన్ యాంటీబయాటిక్ సిరప్లో పురుగులున్నాయని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆస్పత్రిలోని మిగిలిన 306 బాటిల్స్ను సీజ్ చేసి, టెస్ట్ కోసం శాంపిల్స్ భోపాల్ పంపారు. అది జనరిక్ మెడిసిన్ అని, MPలోని ఓ కంపెనీ తయారు చేస్తోందని అధికారులు వెల్లడించారు.
News October 17, 2025
విజయవాడ: విద్యార్థి మృతిపై అనుమానాలు

సింగ్ నగర్లో 9వ తరగతి విద్యార్థి యశ్వంత్ మృతిపై అనుమానాలు నెలకొన్నాయి. బాత్రూమ్లో 2 అడుగుల ఎత్తులో ఉన్న హ్యాంగర్కు ఉరి వేసుకున్నట్లు కనిపించడంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా యశ్వంత్ పేరెంట్స్ విడిపోయారు. తల్లికి క్యాన్సర్ కావడంతో యశ్వంత్ స్కూల్కు సరిగా వెళ్లడం లేదు. చెల్లి దివ్యాంగురాలు. ఈ పరిణామాలతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.