News October 15, 2025

TU: ప్రశాంతంగా ముగిసిన ఎంఈడీ రెండో సెమిస్టర్ పరీక్షలు

image

తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని M.Ed రెండో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని అకాడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. ఈ నెల 8వ తేదీ నుంచి 15వ తేదీ వరకు విద్యార్థులు ఒక్కరు మినహా మిగతా విద్యార్థులు అన్ని పరీక్షలకు హాజరయ్యారన్నారు. విద్యార్థులు ఎటువంటి మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడలేదని వెల్లడించారు. బుధవారం జరిగిన పరీక్షలకు 29 మంది హాజరైనట్లు తెలిపారు.

Similar News

News October 16, 2025

SRD: NMMSకు దరఖాస్తు గడువు పొడిగింపు

image

నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ ఉపకార వేతనాలకు దరఖాస్తు గడువును ఈనెల 18 వరకు పొడిగించినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదివే విద్యార్థులు https://bse.telangana.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఎంపికైన వారికి నెలకు రూ.1000 చొప్పున నాలుగేళ్లు ఉపకార వేతనం అందిస్తారని పేర్కొన్నారు.

News October 16, 2025

బీర్ బాటిళ్లకూ బార్ కోడ్ పెట్టండి: చంద్రబాబు

image

AP: రాష్ట్రంలో ఎక్సైజ్ సురక్షా యాప్‌ను ఇప్పటివరకు 27 వేల మందికి పైగా డౌన్‌లోడ్ చేసుకున్నట్లు అధికారులు CM చంద్రబాబుకు తెలిపారు. యాప్ స్కాన్ ద్వారా చేస్తున్న విక్రయాల్లో ఒక్క నకిలీ మద్యం బాటిల్ కూడా వెలుగు చూడలేదన్నారు. మరింత పకడ్బందీగా వ్యవస్థను తయారు చేయాలని CM ఆదేశించారు. త్వరలో బీర్ బాటిళ్లకు కూడా బార్‌కోడ్ పెట్టాలని తెలిపారు. ఫిర్యాదుల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని సూచించారు.

News October 16, 2025

వరంగల్: 78 పీఎంశ్రీ స్కూళ్లకు నిధులు!

image

బాలకల సాధికారత, బాలికల కౌమర దశ భద్రతా క్లబ్‌లను ఏర్పాటు చేస్తున్న ఆయా పీఎంశ్రీ పాఠశాలలకు రూ.15 వేల చొప్పున మంజూరు చేశారు. ఉమ్మడి జిల్లాలో 78 స్కూల్స్ సెలెక్ట్ అయ్యాయి. నిధులు ఎలా వినియోగించుకోవాలో ఆ పాఠశాలల HMలకు సమాచారం అందించారు. ఈ నెల 15 వరకు క్లబ్ ఏర్పాటు నివేదికను సమర్పించాలి. పీటీఎం సమావేశాల్లో ఈ అంశాన్ని చర్చించాల్సింటుంది. కలెక్టర్ ఆధ్వర్యంలో లైన్ డిపార్టుమెంట్లతో సమన్వయం జరగాల్సి ఉంది.