News October 15, 2025
కోదాడ: ‘ప్రతి కార్యకర్త కృషి చేయాలి’

దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ను బలోపేతం చేయడమే సంగతన్ సృజన్ అభియాన్ ఉద్దేశం అని ఏఐసీసీ పరిశీలకుడు సారత్ రౌత్ అన్నారు. బుధవారం కోదాడలో హుజూర్ నగర్, కోదాడ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతితో కలిసి మాట్లాడారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రధానిని చేసే వరకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
Similar News
News October 16, 2025
ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించిన కలెక్టర్

యాదగిరిగుట్ట మండలం రామాజీపేటలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను కలెక్టర్ హనుమంతరావు పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న ఇళ్లు, పూర్తయిన వాటి వివరాలను పంచాయతీ కార్యదర్శిని అడిగి తెలుసుకున్నారు. స్లాబ్ దశ వరకు పూర్తయిన ఇళ్ల లబ్ధిదారులను బిల్లుల గురించి అడిగి, మిగిలిన పనులు త్వరగా పూర్తి చేసి గృహప్రవేశాలు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
News October 16, 2025
కర్నూలు ‘జీఎస్టీ 2.0’ సభలో స్వల్ప ప్రమాదం

కర్నూలులోని రాగమయూరి గ్రీన్ హిల్స్ ప్రాంగణం ‘జీఎస్టీ 2.0’ సభలో స్వల్ప ప్రమాదం జరిగింది. విద్యదాఘాతంతో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. దీనిపై అధికారులు స్పందించాల్సి ఉంది.
News October 16, 2025
జూబ్లీబైపోల్: 3 రోజుల్లో 35 నామినేషన్లు.. 21 వరకు మరెన్నో?

జూబ్లిహిల్స్ ఉపఎన్నికలకు 3రోజుల నుంచి నామినేషన్లను స్వీకరిస్తున్నారు. ఈ మూడు రోజుల్లో 35 మంది తమ నామినేషన్లను దాఖలు చేశారు. ఇంకా 21 వరకు టైమ్ ఉంది. అంటే ఈ రోజుతో కలిపి ఆరు రోజులన్నమాట. అంటే ఇంకా ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు వస్తాయని అధికారులు భావిస్తున్నారు. విషయమేంటంటే ప్రధాన పార్టీల్లో BJP, కాంగ్రెస్ అభ్యర్థులు ఇంతవరకు నామినేషన్ వేయలేదు. ఒక్క BRS తప్ప. ఎంతమంది పోటీకి సిద్ధమవుతారో చూడాలి మరి.