News October 15, 2025
పొట్టి శ్రీరాములు విగ్రహానికి ‘స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైజ్’గా నామకరణం

AP: అమరావతిలో నిర్మించనున్న 58 అడుగుల ఎత్తైన అమరజీవి పొట్టిశ్రీరాములు విగ్రహ నమూనాలను CM చంద్రబాబు సచివాలయంలో పరిశీలించారు. విగ్రహానికి ‘స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైజ్’గా నామకరణం చేశారు. శాఖమూరులో 6.8 ఎకరాల్లో మెమోరియల్ ట్రస్ట్, స్మృతి వనాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. వచ్చే ఏడాది మార్చి 16న పొట్టి శ్రీరాములు 125వ జయంతి నాటికి ఈ స్మృతివనంలో విగ్రహాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది.
Similar News
News October 16, 2025
నచ్చిన ఫుడ్ ఇష్టమొచ్చినట్లు తినేస్తున్నారా?

చాలామంది ఫుడ్ విషయంలో కాంప్రమైజ్ కారు. నచ్చిన టిఫిన్ అనో, నాన్ వెజ్ కూరనో ఆకలితో సంబంధం లేకుండా పరిమితికి మించి లాగించేస్తుంటారు. కొందరైతే ఫేవరెట్ ఫుడ్ కనిపిస్తే ఇష్టమొచ్చినట్లు తినేస్తారు. అలాంటి వాళ్లు ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. ‘ఆహారం మితంగా తింటేనే ఆరోగ్యం.. అతిగా తింటే ఆయుక్షీణం’. అందుకే టిఫిన్, లంచ్, బ్రేక్ ఫాస్ట్ ఏదైనా కంట్రోల్డ్గా తీసుకోండి. ఇవాళ ప్రపంచ ఆహార దినోత్సవం.
News October 16, 2025
బీర్ బాటిళ్లకూ బార్ కోడ్ పెట్టండి: చంద్రబాబు

AP: రాష్ట్రంలో ఎక్సైజ్ సురక్షా యాప్ను ఇప్పటివరకు 27 వేల మందికి పైగా డౌన్లోడ్ చేసుకున్నట్లు అధికారులు CM చంద్రబాబుకు తెలిపారు. యాప్ స్కాన్ ద్వారా చేస్తున్న విక్రయాల్లో ఒక్క నకిలీ మద్యం బాటిల్ కూడా వెలుగు చూడలేదన్నారు. మరింత పకడ్బందీగా వ్యవస్థను తయారు చేయాలని CM ఆదేశించారు. త్వరలో బీర్ బాటిళ్లకు కూడా బార్కోడ్ పెట్టాలని తెలిపారు. ఫిర్యాదుల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని సూచించారు.
News October 16, 2025
పాక్-అఫ్గాన్ మధ్య సీజ్ ఫైర్.. ట్రంప్పై సెటైర్లు!

పాకిస్థాన్-అఫ్గాన్ దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అంతా US అధ్యక్షుడు ట్రంప్ రియాక్షన్ కోసం ఎదురు చూస్తున్నారు. ‘ఇప్పటికే 8 యుద్ధాలు ఆపానని చెప్పుకుంటున్న ఆయన ఇంకా ఈ క్రెడిట్ తన ఖాతాలో వేసుకోలేదా?’ అని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. ‘ఆయన ఆ మాట చెప్పగానే నోబెల్కి మరోసారి నామినేట్ చేసేందుకు పాక్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ సిద్ధంగా ఉన్నారు’ అంటూ సెటైర్లు వేస్తున్నారు.