News October 16, 2025

MHBD: పత్తి రైతుకు తిప్పలు తప్పవా..!

image

పత్తిని అమ్ముకోవాలంటే రైతులు కపాస్ కిసాన్ యాప్‌లో స్లాట్ బుకింగ్ తప్పనిసరి చేయడంతో పత్తి రైతుకు కొత్త ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు లేని, చదువు రాని రైతులకు ఈయాప్ వాడటం కష్టంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులకు యాప్‌పై అవగాహన సదస్సులను నిర్వహించాలని,అకాల వర్షాలకు భారీగా పత్తి పంటలు దెబ్బతిన్నాయని, పండిన కొద్దిపాటి పత్తిని అమ్ముకోవడానికి రైతులకు ఇబ్బందిగా మారింది.

Similar News

News October 16, 2025

కేటిదొడ్డి: గుప్తనిధుల కోసం తవ్వకాలు

image

కేటిదొడ్డి మండలం గువ్వలదిన్నె సమీపంలో గుప్త నిధుల కోసం గుర్తుతెలియని వ్యక్తులు రోడ్డుపక్కకు ఉన్న ఆంజనేయస్వామి విగ్రహం దగ్గర తవ్వకాలు చేపట్టారు. నిధుల కోసం పెద్ద గుంతను తవ్వారు. దుండగులు తవ్వడం చేతకాక మధ్యలో వదిలేసి వెళ్లిపోయారు. ఆలయంలో ఎలాంటి వస్తువులు విగ్రహాలు ధ్వంసం కాలేదని గ్రామస్థులు తెలిపారు.

News October 16, 2025

అప్పుడు సమంత.. ఇప్పుడు సుమంత్..!

image

మంత్రి సురేఖ ఎప్పుడు ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటున్నారు. గతంలో నటి సమంత పైన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే లేపాయి. చివరకు పరువు నష్టం కేసు పెట్టే వరకు వెళ్లింది. తాజాగా ఓఎస్డీ సుమంత్ వ్యవహారం ఆమె మంత్రి పదవి, ఎమ్మెల్యే పదవికి సైతం ఎసరు పెట్టేలా మారింది. ‘స’ అనే అక్షరం కలిసి రావడం లేదేమో? అని ప్రజలు చర్చించుకుంటున్నారు.

News October 16, 2025

MDK: ఎన్నికల అధికారులమంటూ చోరీ.. జాగ్రత్త

image

మెదక్ జిల్లాలో ఎన్నికల అధికారులమంటూ కేటుగాళ్లు చోరీకి పాల్పడ్డారు. పాపన్నపేట మం. నాగ్సాన్‌పల్లికి చెందిన దంపతులు కిషన్- మణెమ్మ ఎల్లుపేటలో ఫంక్షన్‌కు స్కూటీపై వెళ్తుండగా కొత్తపల్లి వంతెన వద్ద ఎన్నికల అధికారులమంటూ ఆగంతకులు ఆపారు. మీ ఆభరణాలు జాగ్రత్త, డిక్కీలో వేసుకోవాలన్నారు. ఆమె పుస్తెల తాడు, గుండ్లు తీసి దస్తీలో కట్టి డిక్కీలో వేయగా మరోసారి చెక్ చేద్దామని చెప్పి చాకచక్యంగా ఆభరణాలను తస్కరించారు.