News October 16, 2025

19న వేములవాడకు శృంగేరి పీఠాధిపతి..!

image

రాజన్న ఆలయాభివృద్ధే ప్రధాన ఎజెండా అని వేములవాడ MLA, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. వేములవాడ ఆలయ విస్తరణ పనులపై దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యార్, కలెక్టర్ ఎం.హరిత, ఎస్పీ మహేష్ బీ గితేతో బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. భక్తుల సూచనల మేరకు రూ.76 కోట్లు ఆలయ విస్తరణకు, రూ.35 కోట్లు అన్నప్రసాద శాలకు కేటాయించామని చెప్పారు. 19న శృంగేరి పీఠాధిపతి గుడికి రానున్నారని పేర్కొన్నారు.

Similar News

News October 16, 2025

జనగామ: 18న విద్యాసంస్థల బంద్: జేఏసీ

image

బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్త కార్యాచరణలో భాగంగా ఈనెల 18న జనగామ జిల్లాలోని విద్యాసంస్థలను బంద్ చేయనున్నట్లు బీసీ జేఏసీ ప్రతినిధులు తీర్మానించారు. కావున ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, ప్రభుత్వరంగ పరిధిలోని విద్యాసంస్థలు స్వచ్ఛందంగా బంద్‌కు సహకరించాలని కోరారు.

News October 16, 2025

మంగళగిరి: ‘పవన్‌ కళ్యాణ్‌ను కలిసేదాకా ఊరెళ్లను’

image

బెట్టింగ్‌ యాప్‌ల వల్ల తనలా ఎవరూ నష్టపోకూడదని సాయి కుమార్ అనే యువకుడు పాదయాత్ర చేస్తూ వైజాగ్ నుంచి మంగళగిరి జనసేన ఆఫీసుకు వచ్చాడు. బెట్టింగ్ యాప్‌ల వలలో పడి రూ.20 లక్షలు నష్టపోయానని తెలిపాడు. మరొకరు ఇలా నష్టపోకూడదని అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నాడు. ఈ యాప్‌లపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కఠిన చర్యలు తీసుకోవాలని ఆఫీసు ముందు నిరసనకు దిగారు. పవన్‌ను నేరుగా కలిసి విన్నవించాకనే వెళ్తానంటున్నాడు.

News October 16, 2025

సిరిసిల్ల: 5 లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడి వచ్చే ఛాన్స్

image

సీసీఐ కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు పత్తిని విక్రయించి మద్దతు ధర పొందాలని సిరిసిల్ల కలెక్టర్ ఎం.హరిత అన్నారు. సిరిసిల్లలోని కలెక్టరేట్లో పత్తి మొబైల్ యాప్‌ను ఆమె బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ సంవత్సరం జిల్లాలో సుమారు 5 లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడి అయ్యే అవకాశం ఉందన్నారు. గతేడాది జిల్లాలో ప్రభుత్వం 2,46,000 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసిందన్నారు.