News October 16, 2025
పూజలో ఈ నియమాలు పాటిస్తున్నారా?

కొన్ని నియమాలు పాటించకపోతే పూజా ఫలితం దక్కదని పండితులు చెబుతున్నారు. ‘పూజా గదిలో గణేషుడి చిత్రపటాలు ఒకటి కంటే ఎక్కువ ఉండకూడదు. నిలబడి పూజలు చేయకూడదు. పూజకు ముందు కాళ్లకు పసుపు రాసుకోవాలి. స్త్రీలు నుదుట కుంకుమ కచ్చితంగా పెట్టుకోవాలి. మంగళవారం, శుక్రవారం, అమావాస్య రోజున దేవుడి పటాలను శుభ్రం చేయడం శుభప్రదం కాదు. ఈ నియమాలు పాటిస్తే శుభకార్యాలు నిరాటంకంగా జరుగుతాయి’ అని సూచిస్తున్నారు. <<-se>>#Pooja<<>>
Similar News
News October 16, 2025
PIC OF THE DAY

ఏపీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ముగ్గురూ సంప్రదాయ దుస్తుల్లో ఉన్న ఫొటో వైరలవుతోంది. PIC OF THE DAY అని పలువురు పోస్టులు పెడుతున్నారు. కాగా ‘నా తోటి భారతీయుల సౌభాగ్యం కోసం, వారి ఆరోగ్యం కోసం ప్రార్థించా. అందరూ సుఖ సౌభాగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను’ అని మోదీ తెలుగులో ట్వీట్ చేయడం విశేషం.
News October 16, 2025
PHOTO GALLERY: శ్రీశైలంలో PM మోదీ

AP: ప్రధాని మోదీ శ్రీశైల మల్లన్న సేవలో తరించారు. సంప్రదాయ దుస్తులు ధరించి భ్రమరాంబ, మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. పంచామృతాలతో రుద్రాభిషేకం చేశారు. శ్రీశైల ఆలయంలో మోదీ ఫొటోలను పైన గ్యాలరీలో చూడొచ్చు.
News October 16, 2025
రబీ పంటగా ఉలవల సాగు- అనువైన రకాలు

ఉలవలను సాధారణంగా లేట్ ఖరీఫ్/రబీకి ముందు, రబీలో పండించవచ్చు. వీటిని నీటి లభ్యతను బట్టి అక్టోబర్ చివరి వరకు విత్తుకోవచ్చు. P.D.M-1, P.Z.M-1, P.H.G-62 రకాలు సాగుకు అనుకూలం. సాళ్ల పద్ధతిలో గొర్రుతో విత్తేటప్పుడు ఎకరాకు 8-10 కిలోలు, వెదజల్లి దున్నే పద్ధతిలో ఎకరానికి 12-15 కిలోల విత్తనం అవసరం. ప్రతి కిలో విత్తనాన్ని కార్బండిజమ్ 1గ్రా. లేదా థైరమ్ 3గ్రా.తో విత్తనశుద్ధి చేసి విత్తుకోవాలి.