News October 16, 2025

నిర్మల్ నుంచి ప్రయాగ్‌రాజ్‌కు ప్రత్యేక బస్సు

image

నిర్మల్ డిపో ఆర్టీసీ అధికారులు భక్తుల కోసం ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించారు. ఈనెల 27న మధ్యాహ్నం 1 గంటకు నిర్మల్ నుంచి ప్రయాగ్‌రాజ్ దేవాలయానికి ప్రత్యేక బస్సు నడపనున్నారు. ఈ యాత్రలో కాశీ, అయోధ్య దేవస్థానాల దర్శనం కూడా ఉంటుంది. ఒక్కరికి చార్జి రూ.6,399గా నిర్ణయించారు. టికెట్లను ఆర్టీసీ వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవాలన్నారు. వివరాలకు 9959226003, 8328021517 నంబర్లను సంప్రదించాలన్నారు.

Similar News

News October 16, 2025

మంచిర్యాల: గురుకులాల సీట్ల భర్తీకి దరఖాస్తులు

image

మంచిర్యాల జిల్లాలోని అన్ని సాంఘిక సంక్షేమ గురుకుల హాస్టల్స్‌లో 2025-26 విద్యా సంవత్సరానికి 5 నుంచి 9వ తరగతులలో మిగిలిన సీట్లను భర్తీ చేయనున్నట్లు కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో గురుకుల పరీక్షలు రాసిన విద్యార్థులు అర్హులు అన్నారు. ఈ నెల 17 వరకు లక్షెట్టిపేట గురుకుల పాఠశాలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News October 16, 2025

రేపు గుంతకల్లుకు సినీ తారలు

image

గుంతకల్లు పట్టణానికి రేపు సినీ తారలు రానున్నారు. పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్డులో ఓ నూతన షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం చేయడానికి సినీ హీరోయిన్స్ ఐశ్వర్య రాజేశ్, రితిక నాయక్ వస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు ఏర్పాట్లు చేశామని చెప్పారు. రితిక నాయక్ ఇటీవల విడుదలైన మిరాయ్ చిత్రంతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు.

News October 16, 2025

బోగస్ ఓట్లపై ఈసీకి ఆదేశాలు ఇవ్వలేం: HC

image

TG: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బోగస్ ఓట్లపై కేటీఆర్, మాగంటి సునీత దాఖలు చేసిన పిటిషన్లపై విచారణలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సమయంలో ఈసీకి ప్రత్యేక ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఇప్పటికే ఎన్నికల సంఘం ఎలక్టోరల్స్‌ను రివిజన్ చేస్తోందని, ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని చెబుతూ విచారణను ముగించింది.