News October 16, 2025

జనగామ: టార్గెట్ నంబర్ 1.. విజయోస్తు 2.0 అమలు!

image

పదో తరగతి పరీక్ష ఫలితాల్లో జనగామ జిల్లా మూడేళ్లుగా చక్కటి ఫలితాలు సాధించింది. గతేడాది విజయోస్తు-1 ద్వారా ప్రత్యేక పఠన ప్రణాళిక రూపొందించడంతో రాష్ట్ర స్థాయిలో జిల్లా మూడో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. ఐతే ఈసారి కలెక్టర్ రిజ్వాన్ బాషా రాష్ట్ర స్థాయిలో నంబర్ 1 లక్ష్యంగా విజయోస్తు 2.0 ద్వారా ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తున్నారు. తరగతుల సరళిపై నిత్యం ఆరా తీస్తున్నారు.

Similar News

News October 16, 2025

మంచిర్యాల: గురుకులాల సీట్ల భర్తీకి దరఖాస్తులు

image

మంచిర్యాల జిల్లాలోని అన్ని సాంఘిక సంక్షేమ గురుకుల హాస్టల్స్‌లో 2025-26 విద్యా సంవత్సరానికి 5 నుంచి 9వ తరగతులలో మిగిలిన సీట్లను భర్తీ చేయనున్నట్లు కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో గురుకుల పరీక్షలు రాసిన విద్యార్థులు అర్హులు అన్నారు. ఈ నెల 17 వరకు లక్షెట్టిపేట గురుకుల పాఠశాలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News October 16, 2025

రేపు గుంతకల్లుకు సినీ తారలు

image

గుంతకల్లు పట్టణానికి రేపు సినీ తారలు రానున్నారు. పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్డులో ఓ నూతన షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం చేయడానికి సినీ హీరోయిన్స్ ఐశ్వర్య రాజేశ్, రితిక నాయక్ వస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు ఏర్పాట్లు చేశామని చెప్పారు. రితిక నాయక్ ఇటీవల విడుదలైన మిరాయ్ చిత్రంతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు.

News October 16, 2025

బోగస్ ఓట్లపై ఈసీకి ఆదేశాలు ఇవ్వలేం: HC

image

TG: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బోగస్ ఓట్లపై కేటీఆర్, మాగంటి సునీత దాఖలు చేసిన పిటిషన్లపై విచారణలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సమయంలో ఈసీకి ప్రత్యేక ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఇప్పటికే ఎన్నికల సంఘం ఎలక్టోరల్స్‌ను రివిజన్ చేస్తోందని, ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని చెబుతూ విచారణను ముగించింది.