News October 16, 2025
MDK: ఎన్నికల అధికారులమంటూ చోరీ.. జాగ్రత్త

మెదక్ జిల్లాలో ఎన్నికల అధికారులమంటూ కేటుగాళ్లు చోరీకి పాల్పడ్డారు. పాపన్నపేట మం. నాగ్సాన్పల్లికి చెందిన దంపతులు కిషన్- మణెమ్మ ఎల్లుపేటలో ఫంక్షన్కు స్కూటీపై వెళ్తుండగా కొత్తపల్లి వంతెన వద్ద ఎన్నికల అధికారులమంటూ ఆగంతకులు ఆపారు. మీ ఆభరణాలు జాగ్రత్త, డిక్కీలో వేసుకోవాలన్నారు. ఆమె పుస్తెల తాడు, గుండ్లు తీసి దస్తీలో కట్టి డిక్కీలో వేయగా మరోసారి చెక్ చేద్దామని చెప్పి చాకచక్యంగా ఆభరణాలను తస్కరించారు.
Similar News
News October 16, 2025
నిర్మల్: వైద్య కళాశాలలో ప్రొఫెసర్ల భర్తీకి దరఖాస్తులు

జిల్లా వైద్య కళాశాలలో కాంట్రాక్టు పద్ధతిలో ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులకు ఆహ్వానిస్తున్నారు. కాలేజీలో ఒబెస్ట్రిక్ గైనకాలజీ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్ 1, అసిస్టెంట్ ప్రొఫెసర్ 4, సీనియర్ రెసిడెంట్ 2, రేడియో డయగ్నోసిస్లో అసోసియేట్ ప్రొఫెసర్ 1, అసిస్టెంట్ ప్రొఫెసర్ 1, సీనియర్ రెసిడెంట్ 1 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి కాలేజీలోనే ఈ నెల 22న ఇంటర్వ్యూలు ఉండనున్నాయి.
News October 16, 2025
మంత్రి పొన్నం ప్రభాకర్పై దుష్ప్రచారం.. పోలీసులకు ఫిర్యాదు

మంత్రి పొన్నం ప్రభాకర్పై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కరీంనగర్ వన్ టౌన్ పోలీసులకు యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు అబ్దుల్ రహమాన్ కాంగ్రెస్ నాయకులతో కలిసి ఫిర్యాదు చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ చనిపోయారని సోషల్ మీడియాలో పెట్టి దుష్ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్కు చెందిన గీతారెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
News October 16, 2025
RNSBలో ఉద్యోగాలు

రాజ్కోట్ నాగరిక్ సహకారి బ్యాంక్ లిమిటెడ్(RNSB) జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ, పీజీ అర్హతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు ఈ నెల 23 వరకు అప్లై చేసుకోవచ్చు. గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి సడలింపు ఉంది. కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. వెబ్సైట్: https://rnsbindia.com/