News October 16, 2025
కర్నూలుకు బయల్దేరిన ప్రధాని మోదీ

ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి వాయుసేన విమానంలో కర్నూలుకు బయలుదేరారు. కాసేపట్లో ఓర్వకల్లు వినానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం ఎంఐ-17 హెలికాప్టర్లో సుండిపెంటకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో శ్రీశైలం వెళ్లి భ్రమరాంబ అమ్మవారు, మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారు. మధ్యాహ్నం 2.20 గంటలకు కర్నూలులో జరిగి ‘జీఎస్టీ 2.0’ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.
Similar News
News October 16, 2025
ములుగు: దామోదరన్న లొంగిపోతారా?

మావోయిస్టు పార్టీలో సుదీర్ఘంగా కీలక నేతలుగా ఉన్న ఒక్కొక్కరు లొంగిపోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లికి చెందిన బడే చొక్కారావు@ దామోదర్ లొంగిపోతారా? పార్టీలో కొనసాగుతారా? అనే చర్చ జరుగుతోంది. 30 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న దామోదర్.. సభ్యుడు, దళ కమాండర్, కేకేడబ్ల్యూగా ఎదిగి, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యత వహిస్తున్నారు.
News October 16, 2025
‘ఓటుకు నోటు’ కేసు విచారణ వాయిదా

‘ఓటుకు నోటు‘ కేసు నిందితులు రేవంత్, సండ్ర వెంకట వీరయ్య పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు నవంబర్ 3కి వాయిదా వేసింది. రేవంత్పై ఏసీబీ నమోదు చేసిన కేసు చట్టవిరుద్ధమని నిన్న ఆయన తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ పేర్కొన్నారు. ఏసీబీ చట్టం ప్రకారం లంచం తీసుకోవడమే నేరమని వాదించారు. గురువారం కూడా వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను వాయిదా వేసింది. న్యాయమూర్తులు మహేశ్వరి, విజయ్ బిష్ణోయ్ కేసు విచారించారు.
News October 16, 2025
విద్యార్థుల సమగ్రాభివృద్ధే లక్ష్యం: భద్రాద్రి కలెక్టర్

జిల్లాలో గిరిజన విద్యార్థుల సమగ్ర అభివృద్ధి, విద్యా ప్రమాణాల పెంపు, మౌలిక వసతుల అభివృద్ధి ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. గురువారం పాల్వంచలోని కిన్నెరసాని గిరిజన గురుకుల పాఠశాల(బాలుర)ను సందర్శించిన ఆయన, పాఠశాల విద్యా కార్యక్రమాలు, వసతుల పరిస్థితి, విద్యార్థుల సౌకర్యాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఖాళీగా ఉన్న భూమిని కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేయాలని సూచించారు.