News April 8, 2024
పొద్దు తిరుగుడు పంటను కొనుగోలు చేయాలి: హరీశ్ రావు

TG: రాష్ట్రంలోని 1.65 లక్షల క్వింటాళ్ల పొద్దు తిరుగుడు పంటను వెంటనే కొనుగోలు చేయాలని సీఎం రేవంత్ను మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. క్వింటా రూ.6,760 ధరతో 25 శాతం పంటనే కొనుగోలు చేయడంతో మిగతా రైతులు నష్టపోతున్నారని తెలిపారు. తాము అధికారంలో ఉండగా చివరి గింజ వరకు కొనుగోలు చేశామని గుర్తు చేశారు.
Similar News
News January 17, 2026
323 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా<
News January 17, 2026
మట్టి బొమ్మలను దర్శించుకోవడంలో అంతరార్థం ఇదే

సంక్రాంతి వేడుకల్లో భాగంగా ముక్కనుమ నాడు బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తారు. ఇందులో రంగురంగుల మట్టి బొమ్మలను కొలువు తీర్చి పూజిస్తారు. మట్టి నుంచి పుట్టిన ప్రాణి, చివరికి మట్టిలోనే కలుస్తుందనే జీవిత పరమార్థాన్ని ఇది మనకు గుర్తుచేస్తుంది. ప్రకృతిని(మట్టిని) గౌరీ మాతగా భావించి ఆరాధించడం వల్ల, ఆ తల్లి కరుణతో ఇల్లు సిరిసంపదలతో తులతూగుతుందని, కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
News January 17, 2026
చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తినాలి

స్కిన్ ఆరోగ్యంగా, బిగుతుగా ఉండాలంటే తగినంత నీరు తాగాలి. నీటిని సమృద్ధిగా తాగితే చర్మం సాగదు, ముడతలు పడకుండా మెరుస్తూ ఉంటుంది. అందుకే ఈ విటమిన్, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలుండే పదార్థాలను రోజూ తీసుకోవాలి. రాజ్మా, అవిసెగింజలు, బాదం, కాజులనూ తీసుకోవాలి. విటమిన్-సి ఉండే జామ, ఉసిరి తీసుకోవాలి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. చర్మాన్ని ఆరోగ్యంగానూ ఉంచుతాయి. కొబ్బరి, సోయాబీన్, మొలకలు కూడా తీసుకోవాలి.


