News October 16, 2025
పార్వతీపురం: వెటర్నరీ డిపార్ట్మెంట్లో ఖాళీగా 22 పోస్ట్లు

ప్రభుత్వం నుంచి నిధులు విడుదలైన వెంటనే సేవలు అందుబాటులోకి తీసుకు వస్తామని జిల్లా పశుసంవర్ధక శాఖాధికారి డా.ఎస్.మన్మదరావు తెలిపారు. మన్యం జిల్లాలో పశువైద్య అధికారుల పోస్టులు 21, సహాయ సంచాలకుని పోస్ట్ ఒకటి ఖాళీగా ఉన్నట్లు గురువారం చెప్పారు. 80 పశు వైద్య భవనాలకు గానూ 41 పశువైద్య భవనాలకు మరమ్మతులు, 28 నూతన పశువైద్య భవనాల ఏర్పాటు కోసం పైఅధికారులకు ప్రతిపాదనలు పంపామన్నారు.
Similar News
News October 17, 2025
చలికాలం వచ్చేస్తోంది.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు!

ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ చలి ఉండొచ్చని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మరింత అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. ఇలాంటి ఉష్ణోగ్రతల వల్ల శ్వాసకోస వ్యాధులు, ఫ్లూ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంటుంది. ‘చలిలో తిరగకుండా ఉంటే మంచిది. నూలు వస్త్రాలు, స్కార్ఫులు, క్యాప్, గ్లౌజులు ధరించడం మంచిది. వేడి ఆహారాన్నే తీసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రత ఎంతో ముఖ్యం’ అని వైద్యులు సూచిస్తున్నారు.
News October 17, 2025
పోలీసుల విచారణలో నిజాలు వెలుగు చూస్తాయి: కలెక్టర్

పోలీస్ విచారణలో నిజాలు వెలుగు చూస్తాయని కలెక్టర్ కె.హైమావతి తెలిపారు. గురువారం హుస్నాబాద్ మండలం జిల్లెల్లగడ్డలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను సందర్శించి 10 రోజుల క్రితం మృతిచెందిన విద్యార్థి వివేక్ ఘటనపై సహ విద్యార్థులతో ఆరా తీశారు. ప్రిన్సిపల్ను సీసీ కెమెరాలు, రాత్రి విధుల్లో అధ్యాపకుల శ్రద్ధ, భవిష్యత్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.
News October 17, 2025
లోకేశ్ ట్వీట్పై కర్ణాటక, తమిళనాడు నెటిజన్ల ఫైర్!

ఏపీకి వచ్చే పెట్టుబడులతో పొరుగు రాష్ట్రాలకు సెగ తగులుతోందన్న మంత్రి లోకేశ్ <<18020050>>ట్వీట్పై<<>> కర్ణాటక, తమిళనాడు నెటిజన్లు ఫైరవుతున్నారు. 2024-25లో తమిళనాడు వృద్ధి రేటు 11.19%గా ఉంటే APది 8.21% అని గుర్తు పెట్టుకోవాలని సూచిస్తున్నారు. తమిళనాడు ఇండస్ట్రియల్ హబ్గా, బెంగళూరు ఐటీ క్యాపిటల్గా ఉందంటున్నారు. ఏపీ కొత్త రాష్ట్రం అని, గూగుల్ పెట్టుబడులు గొప్ప విషయం అని మరికొందరు లోకేశ్కు సపోర్ట్ చేస్తున్నారు.