News October 16, 2025

‘డెక్కన్ సిమెంట్’ అటవీ భూ ఆక్రమణలపై దర్యాప్తు

image

TG: మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత ఆరోపణలతో తెరపైకి వచ్చిన ‘డెక్కన్ సిమెంటు’పై చర్చ జరుగుతోంది. సూర్యాపేట(D)లో ఈ కంపెనీ 73 Acr అటవీ భూమిని ఆక్రమించిందని ఫిర్యాదులు రాగా గ్రీన్‌ట్రిబ్యునల్ విచారించింది. అటు కేంద్ర అటవీశాఖ కూడా ఆక్రమణలపై దర్యాప్తు చేయాలని 10 రోజుల క్రితం రాష్ట్రాన్ని ఆదేశించింది. దీనిపై రాష్ట్ర అటవీశాఖ విచారిస్తోంది. ఆక్రమణ ఏమేరకు ఉందో త్వరలో తేలుతుందని అధికారులు పేర్కొన్నారు.

Similar News

News October 17, 2025

చలికాలం వచ్చేస్తోంది.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు!

image

ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ చలి ఉండొచ్చని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మరింత అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. ఇలాంటి ఉష్ణోగ్రతల వల్ల శ్వాసకోస వ్యాధులు, ఫ్లూ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంటుంది. ‘చలిలో తిరగకుండా ఉంటే మంచిది. నూలు వస్త్రాలు, స్కార్ఫులు, క్యాప్, గ్లౌజులు ధరించడం మంచిది. వేడి ఆహారాన్నే తీసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రత ఎంతో ముఖ్యం’ అని వైద్యులు సూచిస్తున్నారు.

News October 17, 2025

లోకేశ్ ట్వీట్‌పై కర్ణాటక, తమిళనాడు నెటిజన్ల ఫైర్!

image

ఏపీకి వచ్చే పెట్టుబడులతో పొరుగు రాష్ట్రాలకు సెగ తగులుతోందన్న మంత్రి లోకేశ్ <<18020050>>ట్వీట్‌పై<<>> కర్ణాటక, తమిళనాడు నెటిజన్లు ఫైరవుతున్నారు. 2024-25లో తమిళనాడు వృద్ధి రేటు 11.19%గా ఉంటే APది 8.21% అని గుర్తు పెట్టుకోవాలని సూచిస్తున్నారు. తమిళనాడు ఇండస్ట్రియల్ హబ్‌గా, బెంగళూరు ఐటీ క్యాపిటల్‌గా ఉందంటున్నారు. ఏపీ కొత్త రాష్ట్రం అని, గూగుల్ పెట్టుబడులు గొప్ప విషయం అని మరికొందరు లోకేశ్‌కు సపోర్ట్ చేస్తున్నారు.

News October 17, 2025

చెప్పింది వినకపోతే హమాస్‌ని చంపేస్తాం: ట్రంప్

image

హమాస్‌కు US అధ్యక్షుడు ట్రంప్ మరోసారి వార్నింగ్ ఇచ్చారు. ‘గాజాలో ప్రజల ప్రాణాలు తీయడం ఆపాలి. అది డీల్‌లో లేదు. అలా ఆపని పక్షంలో హమాస్‌ని చంపడం తప్పితే మాకు మరో దార్లేదు’ అని తెలిపారు. అటు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఫోన్లో మాట్లాడినట్లు వెల్లడించారు. ఉక్రెయిన్‌తో యుద్ధంపై చర్చించేందుకు వచ్చేవారం మరోసారి ఆయనతో భేటీకానున్నట్లు చెప్పారు. రేపు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్‌స్కీని కలవనున్నట్లు తెలిపారు.