News October 16, 2025

ములుగు: ఇంటి బాట పట్టిన అడవిలో అన్నలు!

image

ఆపరేషన్ కగారుతో అడవిలో అన్నలు ఇంటిబాట పడుతున్నారు. కొన్ని నెలలుగా ఛత్తీస్‌గఢ్ అడవులను కేంద్ర బలగాలు చుట్టుముట్టాయి. దీంతో కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావుతో పాటు, అగ్రనేతలు మృత్యువాత పడ్డారు. ఈ క్రమంలో గురువారం అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ 60 మందితో లొంగిపోగా, మరో నేత ఆశన్న 140 మందితో నేడో, రేపో లొంగిపోనున్నట్లు తెలుస్తోంది. దీంతో విప్లవ శకం ముగిసినట్లేనా అనే చర్చ మొదలైంది.

Similar News

News October 17, 2025

NZB: గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్

image

నిజమాబాద్‌లో గంజాయి తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్లు మూడవ టౌన్ ఎస్ఐ హరిబాబు తెలిపారు. రైల్వే స్టేషన్ ప్రాంతంలో పెట్రోల్ నిర్వహిస్తుండగా పెంబోలి రైల్వే ట్రాక్ వద్ద ఓ వ్యక్తి పోలీసులు చూసి పారిపోతుండగా అదుపులోకి తీసుకున్నామన్నారు. అతడి నుంచి 110 గ్రాముల గంజాయి స్వాదినపరుచుకుని రిమాండ్‌కు తరలించమన్నారు.

News October 17, 2025

VKB: ఖాళీగా ఉన్న సీట్లకు దరఖాస్తుల ఆహ్వానం

image

వికారాబాద్ జిల్లాలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాలలో 5 నుంచి 9వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. దరఖాస్తులు సమర్పించేందుకు 18న చివరి తేదీ సాయంత్రం 5 గంటల లోపు కొత్తగడిలోని బాలికల పాఠశాలలో ఇవ్వాలన్నారు. దరఖాస్తులతో పాటు కులం, ఆదాయం, హాల్ టికెట్, ర్యాంక్ కార్డు సమర్పించాలన్నారు.

News October 17, 2025

KMR: 49 షాపులకు 419 దరఖాస్తులు

image

మద్యం దుకాణాల దరఖాస్తుల ప్రక్రియకు కామారెడ్డి జిల్లాలో భారీ స్పందన లభిస్తోంది. గురువారం వరకు జిల్లాలోని మొత్తం 49 వైన్ షాపులకు 419 దరఖాస్తులు వచ్చాయని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ హనుమంత రావు పేర్కొన్నారు.
కామారెడ్డి: 15 షాపులకు 104 దరఖాస్తులు
బాన్సువాడ: 9 షాపులకు 84 దరఖాస్తులు
బిచ్కుంద: 10 షాపులకు 79 దరఖాస్తులు
దోమకొండ: 8 షాపులకు 77 దరఖాస్తులు
ఎల్లారెడ్డి: 7 షాపులకు 75 దరఖాస్తులు వచ్చాయన్నారు.