News October 16, 2025
PIC OF THE DAY

ఏపీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ముగ్గురూ సంప్రదాయ దుస్తుల్లో ఉన్న ఫొటో వైరలవుతోంది. PIC OF THE DAY అని పలువురు పోస్టులు పెడుతున్నారు. కాగా ‘నా తోటి భారతీయుల సౌభాగ్యం కోసం, వారి ఆరోగ్యం కోసం ప్రార్థించా. అందరూ సుఖ సౌభాగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను’ అని మోదీ తెలుగులో ట్వీట్ చేయడం విశేషం.
Similar News
News October 17, 2025
CBSLలో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ లిమిటెడ్(CBSL)ముంబై కార్పొరేట్ ఆఫీస్లో ట్రైనీ (అడ్మినిస్ట్రేషన్/ఆఫీస్ వర్క్) పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. డిగ్రీ అర్హతగల అభ్యర్థులు ఈమెయిల్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 20 నుంచి 30ఏళ్ల మధ్య ఉండాలి. పని అనుభవం గలవారికి ప్రాధాన్యం ఉంటుంది. ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://www.canmoney.in/
News October 17, 2025
మహిళలకు ఎడమ కన్ను అదిరితే?

స్త్రీలకు తరచుగా ఎడమ కన్ను అదిరితే శుభప్రదమని పండితులు చెబుతున్నారు. ఇది త్వరలో కొత్త వస్త్రాలు, ఆనందకరమైన స్నేహాలు, భాగస్వామితో మంచి అనుబంధం వంటి శుభప్రదమైన ప్రయాణ యోగాన్ని సూచించే దైవిక సంకేతమని అంటున్నారు. కెరీర్లో విజయం సాధించే అవకాశాలుంటాయని చెబుతున్నారు. అయితే వివాహితకి కుడి కన్ను అదరడం చెడు శకునం అని పేర్కొంటున్నారు. దీనివల్ల భవిష్యత్తులో సమస్యలు, ఆటంకాలు ఎదురుకావచ్చని అంటున్నారు.
News October 17, 2025
రన్స్ చేస్తే ఓకే.. చేయలేదో!

INDvsAUS మధ్య 3 మ్యాచుల వన్డే సిరీస్ ఈ నెల 19 నుంచి ప్రారంభం కానుంది. దీంతో అందరి దృష్టి స్టార్ ప్లేయర్లు విరాట్, రోహిత్లపైనే ఉంది. వచ్చే వన్డే వరల్డ్కప్ జట్టులో స్థానం దక్కాలంటే వీరు ఈ సిరీస్లో రాణించడం కీలకం. అదే విఫలమయ్యారో ఇబ్బందులు తప్పవు. ఇప్పటికే వారి ప్రాతినిధ్యంపై సెలక్షన్ కమిటీ, కోచ్ క్లారిటీ ఇవ్వలేదు. కాగా AUSలో వీరిద్దరికీ మంచి రికార్డ్ ఉంది. రోహిత్, కోహ్లీ చెరో 5 సెంచరీలు బాదారు.