News October 16, 2025
కర్నూలు ‘జీఎస్టీ 2.0’ సభలో స్వల్ప ప్రమాదం

కర్నూలులోని రాగమయూరి గ్రీన్ హిల్స్ ప్రాంగణం ‘జీఎస్టీ 2.0’ సభలో స్వల్ప ప్రమాదం జరిగింది. విద్యదాఘాతంతో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. దీనిపై అధికారులు స్పందించాల్సి ఉంది.
Similar News
News October 17, 2025
చిత్తూరు: సెలవు రోజుల్లోనూ రిజిస్ట్రేషన్ సేవలు

చిత్తూరు జిల్లాలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సెలవు రోజుల్లోనూ రిజిస్ట్రేషన్ సేవలను నిర్వహించనున్నట్లు జిల్లా రిజిస్ట్రార్ వెంకటరమణమూర్తి తెలిపారు. ఇందుకు రూ.5 వేలను ప్రత్యేక రిజిస్ట్రేషన్ ఫీజుగా చెల్లించాలన్నారు. ముందుగానే ఆన్లైన్లో స్లాట్ బుకింగ్ చేసుకుని, అవసరమైన పత్రాలతో కార్యాలయానికి రావాలని సూచించారు. ఈ అవకాశాన్ని జిల్లా వాసులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News October 17, 2025
అధికారులకు షోకాజ్ నోటీస్లు జారీ చేయండి: కలెక్టర్

గృహ నిర్మాణ ప్రగతిపై నిర్వహించిన సమావేశానికి హాజరుకాని ఐదుగురు అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని అధికారులను కలెక్టర్ వెట్రిసెల్వి గురువారం ఆదేశించారు. జిల్లాలో గృహ నిర్మాణాల లక్ష్యసాధనలతో అధికారులు కలిసికట్టుగా పనిచేసి మంచి ప్రగతిని సాధించాలన్నారు. లక్ష్యసాధనలో వెనుకబడిన అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. గృహ నిర్మాణంలో అలసత్వం వహించే కాంట్రాక్టులను తొలగించి కొత్తవారిని నియమించాలన్నారు.
News October 17, 2025
CBSLలో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ లిమిటెడ్(CBSL)ముంబై కార్పొరేట్ ఆఫీస్లో ట్రైనీ (అడ్మినిస్ట్రేషన్/ఆఫీస్ వర్క్) పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. డిగ్రీ అర్హతగల అభ్యర్థులు ఈమెయిల్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 20 నుంచి 30ఏళ్ల మధ్య ఉండాలి. పని అనుభవం గలవారికి ప్రాధాన్యం ఉంటుంది. ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://www.canmoney.in/