News October 16, 2025

గొల్లపల్లి తహశీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

image

గొల్లపెల్లి మండలం తహశీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ సత్యప్రసాద్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూ భారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన భూ సమస్యలపై ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని అధికారులకు సూచించారు. మీసేవా సర్టిఫికెట్లు పెండింగ్లో లేకుండా చూడాలన్నారు. పలు రికార్డులను కలెక్టర్ పరిశీలించారు. ఆయన వెంట ఆర్డిఓ మధుసూదన్ తదితరులున్నారు.

Similar News

News October 17, 2025

సుప్రీంకోర్టు ఆర్డర్ కాపీలో అలా లేదు: ఈసీ

image

TG: స్థానిక ఎన్నికలపై హైకోర్టులో కీలక వాదనలు జరిగాయి. ‘ఎన్నికలకు వెళ్లాలని SC కూడా చెప్పింది కదా?’ అని ECని HC ప్రశ్నించింది. అయితే విచారణ సందర్భంగా అలా వ్యాఖ్యానించింది కానీ ఫైనల్ ఆర్డర్ కాపీలో ఎన్నికలకు వెళ్లాలనే ఆదేశాలు లేవని EC పేర్కొంది. రిజర్వేషన్ల అంశం కోర్టులో పెండింగ్‌లో ఉన్నందున అది తేలేవరకు ఎలక్షన్స్ నిర్వహించలేమంది. ప్రభుత్వంతో చర్చించాకే రీనోటిఫికేషన్ ఇస్తామని HCకి వివరించింది.

News October 17, 2025

ఇలా అయితే.. సిటీ మూసీలోకే: రఘునందన్‌రావు

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సందర్భంగా బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు హాట్ కామెంట్స్ చేశారు. ఎన్నికల్లో విజయం సాధించడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రజలను మభ్యపెడుతున్నాయని పేర్కొన్నారు. కన్నీళ్లతో ఒకరు ప్రచారానికి వస్తే.. కట్టెలు తీసుకొని ఇంకొకరు వస్తున్నారన్నారు. అయితే ఈ ఇద్దరిలో ఎవరు వచ్చినా సిటీ మూసీలో కలవాల్సిన పరిస్థితి వస్తుందని వ్యాఖ్యానించారు. 

News October 17, 2025

జూరాల ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో 38,000 క్యూసెక్కులు

image

ధరూర్ మండలంలోని జూరాల ప్రాజెక్టుకు వరద తగ్గింది. శుక్రవారం ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో 38,000 క్యూసెక్కులు వస్తోంది. ప్రాజెక్టు అన్ని గేట్లు మూసివేశారు. విద్యుత్ ఉత్పత్తికి 34,592 క్యూసెక్కులు, నెట్టెంపాడు లిఫ్ట్ కు 750, భీమా లిఫ్ట్-1 కు 650, లిఫ్ట్ -2 కు 750, ఎడమ కాల్వకు1,030, కుడి కాలువకు 680 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. మొత్తం ప్రాజెక్టు నుంచి 37,773 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.