News October 16, 2025
AI విమాన ప్రమాదంపై న్యాయ విచారణకు సుప్రీంలో పిటిషన్

అహ్మదాబాద్లో 260 మందికి పైగా మరణించిన AI విమాన ప్రమాదంపై న్యాయ విచారణకు ఆ ఫ్లైట్ కెప్టెన్ సుమీత్ తండ్రి పుష్కర్ సభర్వాల్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. AAIB దర్యాప్తు సరిగా లేదని, పైలెట్ల లోపం వల్లే ప్రమాదం అన్న రీతిలో దాని ప్రాథమిక నివేదిక ఉందని తప్పుబట్టారు. ఆ దర్యాప్తును నిలిపి, న్యాయవ్యవస్థ పర్యవేక్షణలో నిపుణులతో స్వతంత్ర విచారణ జరపాలని కోరారు. ఆయనతో పాటు FIP కూడా కోర్టులో పిటిషన్ వేసింది.
Similar News
News October 17, 2025
కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్లో ఉద్యోగాలు

కేరళలోని కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్ 19 కాంట్రాక్ట్ ఔట్ఫిట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 29 వరకు అప్లై చేసుకోవచ్చు. టెన్త్, ITI నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్తో పాటు పని అనుభవం ఉండాలి. రాతపరీక్ష, ప్రాక్టికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.300. SC,ST, PWBDలకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. వెబ్సైట్: https://cochinshipyard.in/
News October 17, 2025
తిరుమల: శ్రీవారి దర్శనానికి 12గంటల సమయం!

AP: తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. టోకెన్లు లేనివారికి శ్రీవారి సర్వదర్శనానికి 12గంటల వరకు సమయం పడుతోంది. అటు వైకుంఠం క్యూకాంప్లెక్స్లోని 30 కంపార్టుమెంట్లలో భక్తులు దర్శనానికి వేచి ఉన్నారు. నిన్న స్వామిని 61,521 మంది దర్శించుకోగా.. 25,101 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.66కోట్లు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.
News October 17, 2025
ఈశాన్య రుతుపవనాల ఎఫెక్ట్.. భారీ వర్షాలు

AP: ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో ఇవాళ ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయని వెల్లడించింది. దక్షిణ కోస్తా తీరం వెంబడి 35-55KM వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.