News October 16, 2025

పారదర్శకంగా ఓటర్ల జాబితా నవీకరణ : కలెక్టర్

image

ఓటర్ల జాబితా నవీకరణ పారదర్శకంగా నిరంతరంగా కొనసాగుతుందని కలెక్టర్ హిమాన్షు శుక్ల తెలిపారు.
గురువారం కలెక్టరేట్లోని కలెక్టర్ చాంబర్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న ఫారం 6 లను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఫారం 6 లను సంపూర్ణంగా పూర్తిచేసే విధంగా రాజకీయ పార్టీల ప్రతినిధులు నూతన ఓటర్లకు అవగాహన కలిగించాలన్నారు.

Similar News

News October 17, 2025

పంపకాల్లో తేడాలతోనే విమర్శలు: కాకాణి

image

రేషన్ అవినీతి సొమ్ము పంపకాల్లో వచ్చిన తేడాల వల్లే TDP నేతలు పరస్పం విమర్శలు చేసుకుంటున్నారని వైసీపీ నేత కాకాణి అన్నారు. నకిలీ మద్యం, రేషన్ ఇలా రోజుకొక అవినీతి కూటమి ప్రభుత్వంలో బయటపడుతుందన్నారు. దీని వెనుక TDP నేతలు ఉన్నారని Dy.CM పవన్, మంత్రి నాదెండ్ల దీనిపై విచారణ చేయాలని కాకాణి డిమాండ్ చేశారు. రేషన్ బియ్యాన్ని పాలిష్ చేసి విదేశాలకు తరలిస్తున్నారని ఆయన ఆరరోపించారు.

News October 17, 2025

నెల్లూరు: ఎందుకీ నిర్లక్ష్యం..!

image

నెల్లూరు జిల్లాలో PM కిసాన్ నిధుల పంపిణీ ఆలస్యం అవుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా 2.19 లక్షల మంది రైతులకు రూ.253.79 కోట్లను ప్రభుత్వాలు జమ చేస్తున్నాయి. గతేడాది వరకు 1.67 లక్షల మంది ఖాతాల్లో 3 విడతల్లో కేవలం రూ.100 కోట్లు మాత్రమే జమైంది. మరో రూ.150 కోట్లు జమవ్వాల్సి ఉంది. ఈకేవైసీ, బ్యాంక్ లింకేజీ, ఫిజికల్ రీ వెరిఫికేషన్ చేయకపోవడంతో దాదాపు 7 వేల మంది ఈ నిధులకు దూరంగా ఉన్నారు.

News October 17, 2025

Way2News కథనం.. విద్యార్థి ఆచూకీ లభ్యం

image

ఉదయగిరి(M) అన్నంపల్లి విద్యార్థి యోగీశ్వర్ ఆచూకీ లభ్యమైనట్లు కుటుంబీకులు తెలిపారు. <<18019708>>విద్యార్థి మిస్సింగ్<<>> అంటూ Way2Newsలో కథనం వచ్చిన విషయం తెలిసిందే. విద్యార్థి తిరుపతిలో ఉండగా ఓ వ్యక్తి గుర్తించి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వారు వెంటనే తిరుపతికి వెళ్లి విద్యార్థిని కలిశారు. Way2Newsలో వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తమ బిడ్డను తిరుపతిలో వ్యక్తి గుర్తించి సమాచారం ఇచ్చారని వారు తెలిపారు.