News October 16, 2025

జిల్లాలో పనులు త్వరగా పూర్తిచేయాలి: ఫైజాన్ అహ్మద్

image

జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల పనులను వెంటనే పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని, EGS నిధుల ద్వారా ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీల్లో మరుగుదొడ్ల నిర్మణాలు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. గ్రామాల్లో కొనసాగుతున్న పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

Similar News

News October 19, 2025

ADB: చివరి రెండు రోజులు పోటెత్తారు!

image

మద్యం షాపుల నిర్వహణకు దరఖాస్తు ఫీజు రూ.3 లక్షలకు పెంచడంతో జిల్లాలో ఈసారి 711 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. గతంలో 1047 వచ్చినా, ఫీజు పెంపుతో ప్రభుత్వానికి రూ.21.33 కోట్ల ఆదాయం సమకూరింది. గతంతో పోలిస్తే రూ.39లక్షలు ఎక్కువ. ఉట్నూర్ ఎసైజ్ స్టేషన్ పరిధిలో 39వ షాపునకు అత్యధికంగా 25 దరఖాస్తులు వచ్చాయి. 9 షాపులకు రీ-టెండర్ అవకాశం ఉండగా, 3రోజుల క్రితం100లోపే దరఖాస్తులుండగా.. చివరి 2 రోజుల్లో భారీగా వచ్చాయి.

News October 19, 2025

పార్వతీపురం మన్యం జిల్లాలో రేపు PGRS రద్దు

image

ప్రతి సోమవారం కలెక్టరెట్లో నిర్వహించే PGRS కార్యక్రమం ఈనెల 20న (సోమవారం) దీపావళి పండగ సందర్భంగా రద్దు చేసినట్లు పార్వతీపురం మన్యం కలెక్టర్ ఎన్.ప్రభాకర రెడ్డి ప్రకటించారు. ఆపై సోమవారం నుంచి PGRS యధావిధిగా జరుగుతుందని తెలిపారు. ఈవారం PGRS రద్దు విషయాన్ని అర్జీదారులు గమనించాలని విజ్ఞప్తి చేశారు.

News October 19, 2025

కృష్ణ చెక్‌పోస్ట్‌పై ఏసీబీ దాడులు.. UPDATE

image

NRPT జిల్లా రాష్ట్ర సరిహద్దులోని కృష్ణ ఆర్టీవో చెక్‌పోస్ట్‌పై ACB అధికారులు మధ్య రాత్రి దాడులు చేశారు. అధికారులు తనిఖీల సమయంలో కార్యాలయంలో విద్యుత్ లైట్లను ఆఫ్ చేసి, టార్చ్‌లైట్ల సహాయంతో సోదాలు జరిపారని సమాచారం. ఆ సమయంలో మోటార్ వెహికల్ అధికారి ప్రవీణ్ విధుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సోదాల్లో లెక్క చూపని నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అవినీతి ఫిర్యాదుల నేపథ్యంలో దాడులు చేసినట్లు తెలుస్తోంది.