News October 16, 2025

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక: తొలి ర్యాండమైజేషన్ పూర్తి

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కోసం ఈవీఎంలు, వీవీప్యాట్ల తొలి ర్యాండమైజేషన్ పూర్తయిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఇది నిర్వహించారు. ఆయా పార్టీల నేతల సమక్షంలో స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచామన్నారు. జూబ్లీహిల్స్‌‌లో మొత్తం 407 పోలింగ్‌ కేంద్రాలకు 569 బ్యాలెట్ యూనిట్లు, 569 కంట్రోల్ యూనిట్లు, 610 వీవీప్యాట్లు కేటాయించారు.

Similar News

News October 17, 2025

HYD: నిమ్స్‌లో అనస్థీషియా విద్యార్థి అనుమానాస్పద మృతి

image

పంజాగుట్ట నిమ్స్ ఆస్పత్రిలో అనస్థీషియా వైద్య విద్యార్థి నితిన్ అనుమానాస్పద మృతి చెందాడు. నిన్న రాత్రి విధులకు హాజరుకాగా.. ఇవాళ ఉదయం ఆపరేషన్ థియేటర్లో విగతజీవిగా పడి ఉన్నాడు. ఆస్పత్రి సిబ్బంది సమాచారంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనుమానాస్పద మృతి పట్ల పోలీసులు సీసీ ఫుటేజీ పరిశీలిస్తున్నారు.

News October 17, 2025

HYD: ఖజానా నింపేందుకు ప్రభుత్వ భూమి ఈ వేలం

image

రాయదుర్గంలోని నాలెడ్జి సిటీలో 4,718.22 చదరపు అడుగుల ప్రభుత్వ స్థలం ఉంది. దానిని వేలం వేయాలని సర్కారు నిర్ణయించింది. కనీస ధర (గజం) రూ.3.10 లక్షలుగా నిర్ణయించింది. వచ్చేనెల 10న E-వేలం నిర్వహించేందుకు టీజీఐఐసీ ఏర్పాట్లు చేస్తోంది. ఆ రోజు మ. 3 నుంచి E-వేలం నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించి ఈ నెల 22న ప్రీ బిడ్ మీటింగ్ నిర్వహించనున్నారు.

News October 17, 2025

మెట్రో స్వాధీనంపై కమిటీ.. ఛైర్మన్‌గా TG సీఎస్

image

హైదరాబాద్ మెట్రోను రాష్ట్ర ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకోబోతోంది. ఈ ప్రక్రియ మరింత వేగవంతమైంది. ఇందులో భాగంగా ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేయనుంది. చీఫ్ సెక్రెటరీ ఛైర్మన్‌గా కమిటీని ఏర్పాటుచేసి నివేదిక కోరనుంది. మెట్రోపై పూర్తిగా అధ్యయనం చేయాలని ఆదేశించనుంది. కమిటీలో మెట్రో రైల్ ఎండీ, ఫైనాన్స్ చీఫ్ సెక్రటరీ, ఎంఏయూడీ సెక్రెటరీ, లా సెక్రెటరీ మెంబర్లుగా ఉంటారు.