News October 16, 2025

NGKL: ప్రభుత్వ డిగ్రీ పీజీ కళాశాలలో పీజీ విద్యార్థినికి గోల్డ్ మెడల్

image

పాలమూరు యూనివర్సిటీలో జరిగిన స్నాతకోత్సవ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ గవర్నమెంట్ డిగ్రీ పీజీ ఆర్ట్స్ & కామర్స్ కళాశాల విద్యార్థిని హేమలతకు 2023 సంవత్సరానికి గాను M.A ఎకనామిక్స్‌లో గోల్డ్ మెడల్ ప్రదానం చేశారు. కళాశాల ప్రిన్సిపల్ డా.గీతాంజలి, ఆర్థికశాస్త్ర విభాగాధిపతి వై.కృష్ణయ్య, విభాగ అధ్యాపకులు డా.ఆర్.కృష్ణ, Ch.సతీశ్, కళాశాల లెక్చరర్స్, విద్యార్థులు ఆమెను అభినందించారు.

Similar News

News October 17, 2025

కేబినెట్ సబ్ కమిటీకి మెట్రో కమిటీ నివేదిక

image

హైదరాబాద్ మెట్రోపై ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే మెట్రో కమిటీ తన నివేదికను కేబినెట్ సబ్ కమిటీకి ఇవ్వనుంది. మెట్రో కమిటీ ఇచ్చిన నివేదికను కేబినెట్ సబ్ కమిటీ క్షుణ్ణంగా పరిశీలించి నిపుణులతో మాట్లాడుతుంది. సాధ్యాసాధ్యాలపై కూలంకుశంగా విచారించి ఓ నిర్ణయం తీసుకుంటుంది. దానిపై రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుంది. ఈ తతంగం సాధ్యమైనంత తొందరగా పూర్తిచేయాలని సర్కారు భావిస్తోంది.

News October 17, 2025

‘ఏక్ పేడ్ మా కే నామ్’.. విస్తరించండి: గవర్నర్

image

విద్యార్థులు ఒక్కొక్కరు కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించాలి పీయూ ఛాన్సలర్, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పిలుపునిచ్చారు. పీయూలో నిర్వహించిన స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడుతూ.. ‘స్నాతకోత్సవం అనేది కేవలం పట్టాల ప్రదాన వేడుక మాత్రమే కాదు, విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల సేవ, తల్లిదండ్రుల త్యాగాలను స్మరించుకునే పవిత్ర సందర్భం. ‘ఏక్ పేడ్ మా కే నామ్’ కార్యక్రమాన్ని తెలంగాణ వ్యాప్తంగా విస్తరించాలని’ సూచించారు.

News October 17, 2025

త్వరలోనే పూర్తి స్థాయి కార్యకలాపాలు ప్రారంభం: MLA

image

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజల దీర్ఘకాల స్వప్నమైన మామునూరు విమానాశ్రయం త్వరలోనే పూర్తి స్థాయి కార్యకలాపాలు ప్రారంభించబోతోందని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. విమానాశ్రయ అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూ.90 కోట్లు మంజూరు చేసిన నేపథ్యంలో సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని, వరంగల్ సమగ్ర అభివృద్ధిపై ప్రజా ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టిందని ఎమ్మెల్యే చెప్పారు.