News October 16, 2025
జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

> ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని నిలదీసిన కాంగ్రెస్ కార్యకర్త
> ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన: కడియం
> రఘునాథపల్లి: Way2News కథనానికి స్పందన
> జనగామ కలెక్టరేట్ ఎదుట సీపీఎం నేతల ధర్నా
> బచ్చన్నపేట: రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికైన ఎంజేపీ విద్యార్థి
> ప్రభుత్వ ఆసుపత్రులపై ఉన్న నమ్మకాన్ని కాపాడాలి: కలెక్టర్
> రైతులు పత్తి కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్
Similar News
News October 17, 2025
కేబినెట్ సబ్ కమిటీకి మెట్రో కమిటీ నివేదిక

హైదరాబాద్ మెట్రోపై ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే మెట్రో కమిటీ తన నివేదికను కేబినెట్ సబ్ కమిటీకి ఇవ్వనుంది. మెట్రో కమిటీ ఇచ్చిన నివేదికను కేబినెట్ సబ్ కమిటీ క్షుణ్ణంగా పరిశీలించి నిపుణులతో మాట్లాడుతుంది. సాధ్యాసాధ్యాలపై కూలంకుశంగా విచారించి ఓ నిర్ణయం తీసుకుంటుంది. దానిపై రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుంది. ఈ తతంగం సాధ్యమైనంత తొందరగా పూర్తిచేయాలని సర్కారు భావిస్తోంది.
News October 17, 2025
‘ఏక్ పేడ్ మా కే నామ్’.. విస్తరించండి: గవర్నర్

విద్యార్థులు ఒక్కొక్కరు కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించాలి పీయూ ఛాన్సలర్, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పిలుపునిచ్చారు. పీయూలో నిర్వహించిన స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడుతూ.. ‘స్నాతకోత్సవం అనేది కేవలం పట్టాల ప్రదాన వేడుక మాత్రమే కాదు, విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల సేవ, తల్లిదండ్రుల త్యాగాలను స్మరించుకునే పవిత్ర సందర్భం. ‘ఏక్ పేడ్ మా కే నామ్’ కార్యక్రమాన్ని తెలంగాణ వ్యాప్తంగా విస్తరించాలని’ సూచించారు.
News October 17, 2025
త్వరలోనే పూర్తి స్థాయి కార్యకలాపాలు ప్రారంభం: MLA

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజల దీర్ఘకాల స్వప్నమైన మామునూరు విమానాశ్రయం త్వరలోనే పూర్తి స్థాయి కార్యకలాపాలు ప్రారంభించబోతోందని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. విమానాశ్రయ అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూ.90 కోట్లు మంజూరు చేసిన నేపథ్యంలో సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని, వరంగల్ సమగ్ర అభివృద్ధిపై ప్రజా ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టిందని ఎమ్మెల్యే చెప్పారు.