News October 17, 2025
నర్సాపూర్: ముగ్గురు ఉపాధ్యాయులు సస్పెండ్

నర్సాపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న ముగ్గురు ఉపాధ్యాయులను జిల్లా విద్యాధికారి డాక్టర్ రాధా కిషన్ సస్పెండ్ చేశారు. ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఒక ప్రధానోపాధ్యాయుడు, ఇద్దరు ఉపాధ్యాయులు విధుల పట్ల నిర్లక్ష్యం వహించాలన్న సమాచారంతో విచారణ చేపట్టిన డీఈవో వారిని గురువారం సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
Similar News
News October 17, 2025
మెదక్: ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిలిం పోటీలు: ఎస్పీ

పోలీస్ అమరవీరుల సంస్కరణ దినం ఫ్లాగ్ డే పురస్కరించుకొని రాష్ట్రస్థాయి ఫొటోగ్రఫీ అండ్ షార్ట్ ఫిలిం పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపారు. మెదక్ జిల్లా పరిధిలో ఔత్సాహిక ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్ల కోసం పోటీలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈనెల 21 నుంచి 31 వరకు పోలీస్ ఫ్లాగ్ డే వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు.
News October 17, 2025
మెదక్: దీపావళి ఆఫర్ల పేరుతో మోసం: ఎస్పీ

దీపావళి పండుగ స్పెషల్ ఆఫర్ల పేరుతో సైబర్ మోసగాళ్లు సోషల్ మీడియా, వాట్సప్, ఎస్ఎంఎస్ల ద్వారా నకిలీ వెబ్సైట్ల ద్వారా లింకులు పంపి ప్రజలను మోసం చేస్తున్నారని జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ మేరకు మాట్లాడుతూ.. ఈ లింకుల ప్రలోభాలు చూపి డబ్బులు వసూలు చేస్తున్నట్లు వివరించారు. ఇలాంటి ఫేక్ లింకులు, వెబ్ సైట్లలో వ్యక్తిగత వివరాలు బ్యాంకు వివరాలు ఇవ్వరాదని సూచించారు.
News October 17, 2025
మెదక్: ‘తపాలా శాఖ ద్వారా ఓటర్లకు గుర్తింపు కార్డులు’

నూతన ఓటర్లకు గుర్తింపు కార్డులను తపాలా శాఖ ద్వారా అందించే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్య ఎలక్ట్రోరల్ అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించగా మెదక్ జిల్లా ఎన్నికల అధికారి/కలెక్టర్ రాహుల్ రాజ్, సహాయ ఎన్నికల అధికారులు, తహశీల్దార్లు పాల్గొన్నారు. ఓటర్లుగా నమోదైన ప్రతి ఒక్కరికి తపాలా శాఖ ద్వారా ఓటర్ గుర్తింపు కార్డులను పంపిణీ చేయాలని తెలిపారు.