News October 17, 2025
‘ధాన్యం కొనుగోలుకు అధికారులు సన్నద్ధత కావాలి’

పార్వతీపురం జిల్లాలో 2025-26 ఖరీఫ్ సీజనులో ధాన్యం కొనుగోలుకు ఇప్పటినుంచే సన్నద్ధత కావాలని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ధాన్యం కొనుగోళ్ల సంసిద్ధతపై గురువారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్ సీజనులో రైతుల నుంచి 2.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ అంచనాగా నిర్ణయించామన్నారు.
Similar News
News October 17, 2025
సంగారెడ్డి : ఉత్సాహంగా కరాటే ఉమ్మడి జిల్లా పోటీలు

స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి మెదక్ జిల్లా అండర్ 19 కరాటే పోటీలు శుక్రవారం సంగారెడ్డిలో నిర్వహించారు. SFG జిల్లా కార్యదర్శి గణపతి పోటీలను ప్రారంభించారు. గుమ్మడి మెదక్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొన్నారు. కరాటే పోటీలో ప్రతిభ చూపిన విద్యార్థులు రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తామని కార్యదర్శి గణపతి తెలిపారు.
News October 17, 2025
3 రోజులు సెలవులు!

TG: రేపటి నుంచి స్కూళ్లకు వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి. రేపు రాష్ట్రవ్యాప్తంగా బంద్ ఉండటంతో ఇప్పటికే పలు విద్యాసంస్థలు శనివారం సెలవు ప్రకటించాయి. ఎల్లుండి ఆదివారం, సోమవారం దీపావళి సెలవులు రానున్నాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగులకూ వరుసగా 3 రోజులు హాలిడేస్ వచ్చాయి. మరి లాంగ్ వీకెండ్ నేపథ్యంలో మీరు ఎక్కడికి వెళ్తున్నారు? సెలవులు ఎలా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారో కామెంట్ చేయండి.
News October 17, 2025
సుర్యాపేట: అబ్దుల్ కలాం మాటలను స్ఫూర్తిగా తీసుకోవాలి: కలెక్టర్

ఆకాశమే హద్దుగా కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి అని చెప్పిన అబ్దుల్ కలాం మాటలను స్ఫూర్తిగా తీసుకొని ఆచరణలోకి తీసుకొని రావాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ విద్యార్థులకు సూచించారు. కలెక్టరేట్లో మహిళా, శిశు, దివ్యాంగులు, వయో వృద్ధుల శాఖలోని మహిళా సాధికారత ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ బాలిక దినోత్సవం-2025 కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు.