News April 8, 2024
RR: కేసులు పెండింగ్.. నూతన కమిషన్ కోసం డిమాండ్!

కేసుల సత్వర పరిష్కారం దిశగా RR జిల్లా వినియోగదారుల కమిషన్ చర్యలు తీసుకుంటోంది. గత 55 రోజుల్లోనే చాలా కేసులను పరిష్కరించినట్లుగా తెలిపింది. రంగారెడ్డి జిల్లా కమిషన్లో రాష్ట్రంలోనే అధిక కేసులు నమోదవుతుంటాయి. మరోవైపు మార్చి నెల చివరి నాటికి రంగారెడ్డి జిల్లా కమిషన్లో రాష్ట్రంలోనే అధికంగా 1,405 కేసులు పెండింగ్లో ఉన్నాయి. దీంతో నూతన కమిషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరింది.
Similar News
News September 11, 2025
HYD: ఆశలు, ఆకాంక్షలకు చిహ్నాలుగా జైళ్లు: మంత్రి

జైళ్లు నిరాశకు కేంద్రాలుగా కాకుండా, ఆశలు, ఆకాంక్షలకు చిహ్నాలుగా మారాలని మంత్రి శ్రీధర్ బాబు ఆకాంక్షించారు. “ఏడో ఆలిండియా ప్రిజన్ డ్యూటీ మీట్ – 2025” సందర్భంగా ఆర్బీవీఆర్ఆర్ తెలంగాణ పోలీస్ అకాడమీలో బుధవారం ఏర్పాటు చేసిన ‘కల్చరల్ నైట్’కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జైళ్లను కేవలం శిక్షా కేంద్రాలుగా కాకుండా, మానవత్వంతో కూడిన సంస్కరణలకు వేదికలుగా తీర్చిదిద్దేలా తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
News September 11, 2025
HYD: హైకోర్టులో నల్లా బాలుకు ఊరట.. KTR హర్షం

సోషల్ మీడియా యాక్టివిస్ట్ నల్లా బాలుపై కాంగ్రెస్ పెట్టిన 3 కేసులను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఈ తీర్పుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ‘ఇది ప్రజాస్వామ్యానికి లభించిన విజయం. కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు. రాజకీయ ప్రేరేపిత కేసులతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను వేధించడం ఆపాలి’ అని డీజీపీని కోరారు. కేసులో విజయం సాధించినందుకు బీఆర్ఎస్ లీగల్ సెల్కు అభినందనలు తెలిపారు.
News September 11, 2025
HYD: ‘రోడ్డు ప్రమాదాల్లో తెలంగాణది 8వ స్థానం’

రోడ్డు ప్రమాదాల్లో జాతీయ స్థాయిలో తెలంగాణ 8వ స్థానంలో, మరణాల్లో 10వ స్థానంలో ఉందని సీఎస్ రామకృష్ణారావు అన్నారు. బుధవారం సుప్రీంకోర్టు కమిటీ ఛైర్మన్ అభయ్ మనోహర్ సప్రే, తెలంగాణ అధికారులతో రోడ్డు భద్రతపై సమావేశం నిర్వహించారు. హెల్మెట్లు, సీట్ బెల్టులు ధరించకపోవడం, మద్యం తాగి వాహనాలు నడపడం, మొబైల్ ఫోన్ వాడకం, అతివేగం వంటి ప్రధాన కారణాలుగా గుర్తించామన్నారు. అవగాహన కార్యక్రమాలు పెంచాలన్నారు.