News October 17, 2025
పిల్లలు చదవట్లేదా?

సాధారణంగా చాలామంది పిల్లలు చదువంటే ఆసక్తి చూపరు. ఆటలమీదే మనసు ఉంటుంది. కొన్నిసార్లు ఇది మానసిక సమస్యకు సంకేతం అంటున్నారు నిపుణులు. బార్డర్లైన్ ఇంటిలిజెన్స్, స్పెసిఫిక్ లర్నింగ్ డిజెబిలిటి, ADHD వంటి సమస్యలుంటే పాఠాలు అర్థంకాకపోవడం, ఏకాగ్రత లోపించడం వంటి లక్షణాలుంటాయి. వీటిని గుర్తిస్తే చైల్డ్ సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్లండి. చదువంటే భయం తగ్గి ఆసక్తి కలిగే పద్ధతులు నేర్పిస్తారు.
Similar News
News February 1, 2026
బడ్జెట్లో రియల్ ఎస్టేట్.. ‘ఆశ-నిరాశ’!

బడ్జెట్పై రియల్ ఎస్టేట్ రంగం మిశ్రమంగా స్పందించింది. మెట్రో, హైవే, రైల్వేల వంటి ఇన్ఫ్రా ప్రాజెక్టుల వల్ల టైర్-2 నగరాల్లో రియల్ ఎస్టేట్ పుంజుకుంటుందని నిపుణులు అంటున్నారు. కానీ అఫర్డబుల్ హౌసింగ్కు ఇన్సెంటివ్స్ లేకపోవడంపై CREDAI పెదవి విరిచింది. ఖర్చులు పెరిగి కొత్త ఇళ్ల నిర్మాణాలు పడిపోతాయని హెచ్చరించింది. ఇన్ఫ్రా వల్ల కొత్త ఏరియాలు డెవలప్ అయినా సామాన్యుడికి సొంతింటి కల దూరమవుతుందని పేర్కొంది.
News February 1, 2026
‘సింగరేణి’ పై కమిటీ నివేదిక అందింది: కిషన్ రెడ్డి

TG: సింగరేణి కాలరీస్ కంపెనీ వ్యవహారాలపై అధికారుల కమిటీ నివేదిక అందిందని బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. దీనిని పరిశీలించాల్సి ఉందని ఢిల్లీలో మీడియా చిట్చాట్లో పేర్కొన్నారు. గత BRS ప్రభుత్వ హయాంలోనే సింగరేణిలో ఎక్కువ అక్రమాలు జరిగాయని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ₹51000 CR సంస్థకు బకాయి పడిందని చెప్పారు. కాగా నైనీ బొగ్గు గనుల టెండర్లు, CSR నిధులపై వివాదం నెలకొనడం తెలిసిందే.
News February 1, 2026
పాకిస్థాన్పై భారత్ ఘన విజయం

ఐసీసీ U19 వన్డే వరల్డ్ కప్లో పాకిస్థాన్పై 58 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన యంగ్ ఇండియా 252 రన్స్ చేయగా, పాక్ 194 పరుగులకే ఆలౌటైంది. ఆయుశ్ మాత్రే, ఖిలాన్ చెరో 3 వికెట్లు, అంబరీశ్, హెనిల్, చౌహాన్, విహాన్ తలో వికెట్ చేశారు. ఈ గెలుపుతో ఆయుశ్ సేన జైత్ర యాత్రను కొనసాగిస్తూ సెమీ ఫైనల్లోకి అడుగుపెట్టింది.


