News October 17, 2025

అన్నమయ్య: టీచర్‌పై పోలీసులకు ఫిర్యాదు

image

అన్నమయ్య జిల్లాలోని ఓ టీచర్‌పై కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మదనపల్లెకు చెందిన ఓ టీచర్ తంబళ్లపల్లెలో పనిచేస్తున్నారు. ఆయన దగ్గర 50 మందికి పైగానే రూ.2కోట్ల వరకు చీటీలు వేశారు. తమ డబ్బు ఒకేసారి ఇవ్వాలని కోరగా టీచర్ నిరాకరించారని బాధితులు వాపోయారు. ఈ మేరకు మదనపల్లె డీఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు. తనకు ఆస్తులు ఉన్నాయని.. 4 నెలల సమయమిస్తే చెల్లిస్తానని టీచర్ చెప్పినట్లు సమాచారం.

Similar News

News October 18, 2025

ఏజెన్సీ గురుకులాలను వణికిస్తున్న విషజ్వరాలు

image

AP: ఏజెన్సీల్లోని గురుకుల విద్యార్థులను విషజ్వరాలు వణికిస్తున్నాయి. కురుపాం స్కూళ్లో 150 మందికి పైగా జాండీస్ సోకగా ఇద్దరు మరణించడం తెలిసిందే. తాజాగా సాలూరు ఇతర ప్రాంతాల్లో 2900 మందికి వైద్య పరీక్షలు చేయగా 21మంది జ్వరాలున్నట్లు తేలింది. జాండీస్, మలేరియా ఉన్న వారికి చికిత్స అందిస్తున్నారు. స్కూళ్లలో పారిశుధ్య లోపం, ఏళ్లతరబడి మంచినీటి ట్యాంకులను శుభ్రం చేయకపోవడమే వీటికి కారణమని పేర్కొంటున్నారు.

News October 18, 2025

పెద్దపల్లి: ఈనెల 22న జాబ్ మేళా

image

పెద్దపల్లి జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ఈనెల 22న ఉదయం 11 గంటలకు కలెక్టరేట్ రూమ్ నం. 225లో జాబ్ మేళా ఉంటుందని ఉపాధి అధికారి ఎం. రాజశేఖర్ తెలిపారు. ఓ ప్రైవేటు ఇండస్ట్రీస్‌లో మిషన్ ఆపరేటర్, సూపర్వైజర్, క్లర్క్ వంటి 14 ఖాళీలు ఉన్నాయన్నారు. 18-35 ఏళ్ల అర్హులైన అభ్యర్థులు సర్టిఫికేట్లతో హాజరుకావాలన్నారు.

News October 18, 2025

HYD: ఆటోవాలాకు ‘దీపావళి పండుగ’

image

బీసీల 42% రిజర్వేషన్‌ బిల్లుపై హైకోర్టు స్టే విధించడంతో అన్ని పార్టీలు ఏకకంఠంగా తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చాయి. దీంతో ఆర్టీసీ చక్రాలు ఆగిపోయాయి. బస్టాప్‌లు ఆటోలతో కిక్కిరిశాయి. పాఠశాలలు మూతపడి, ఉద్యోగాలు కొనసాగడంతో ఆటోల డిమాండ్‌ ఆకాశాన్నంటింది. ప్రయాణికులు డబుల్‌ ఛార్జీకి ఒప్పుకోవాల్సి వచ్చింది. అకస్మాత్తుగా పడిన ఈ అదృష్టంతో ఆటోవాలకు ముందుగానే ‘దీపావళి’ వెలుగొచ్చిందని సంబరపడుతున్నారు.